Begin typing your search above and press return to search.

పూజాహెగ్డే ఆవిష్కరించిన సుశాంత్ 'మా నీళ్ల ట్యాంక్‌' ట్రైలర్..!

By:  Tupaki Desk   |   8 July 2022 1:32 PM GMT
పూజాహెగ్డే ఆవిష్కరించిన సుశాంత్ మా నీళ్ల ట్యాంక్‌ ట్రైలర్..!
X
ప్రముఖ డిజిటల్ వేదిక ZEE5 తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందించడానికి కృషి చేస్తోంది. ఇటీవల కాలంలో పలు బ్లాక్ బస్టర్ సినిమాలను ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ''మా నీళ్ల ట్యాంక్‌'' అనే ఒరిజినల్ సిరీస్ తో రాబోతోంది.

''మా నీళ్ల ట్యాంక్‌'' సిరీస్ ద్వారా అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌ ఓటీటీ స్పేస్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. అలానే 'లీడర్' బ్యూటీ ప్రియా ఆనంద్ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేసారు.

సౌత్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఆకర్షణీయమైన 'మా నీళ్ల ట్యాంక్' ట్రైలర్‌ ను లాంచ్ చేసి, టీమ్ మొత్తానికి విషెస్ అందజేసింది. ట్రైలర్ విషయానికొస్తే.. ఫన్నీ పాత్రలతో ఆద్యంతం వినోదభరితంగా సాగింది. బుచ్చివోలు అనే గ్రామంలోని నీళ్ల ట్యాంక్‌ చుట్టూ ఈ కథ నడుస్తోందని తెలుస్తోంది.

ఇందులో వంశీ అనే పోలీసాఫీసర్ పాత్రలో సుశాంత్ కనిపించాడు. అయితే ఆ ఊర్లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కేసులు రాకపోవడంతో.. అతను అక్కడి నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ఆశ పడుతున్నాడు. అలాంటి టైంలో ఆ ఊరి పెద్ద కొడుకు గోపాల్ (సుదర్శన్) నీళ్ళ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు.

తాను ప్రేమించిన సురేఖ (ప్రియా ఆనంద్) ను తిరిగి తీసుకొస్తే కానీ ఆ ట్యాంక్ పైనుండి తాను దిగనని బెదిరిస్తున్నాడు. ఊరి నుంచి వెళ్లిపోయిన సురేఖను తిరిగి తీసుకొచ్చి.. అక్కడి నుండి ట్రాన్సఫర్ చేయించుకోవాలని వంశీ భావిస్తున్నాడు.

అబద్ధాలు చెప్పి సురేఖని తీసుకొచ్చే క్రమంలో వంశీ ఆమె ప్రేమలో పడినట్లు అర్థం అవుతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సురేఖ అతనితో సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నట్లు కనిపిస్తోంది. సురేఖ - వంశీ ప్రేమకథ ఎలా ముగిసిందనేది తెలియాలంటే 'మా నీళ్ల ట్యాంక్' చూడాల్సిందే.

ఈ సిరీస్ లో సుశాంత్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. తొలిసారిగా డిఫరెంట్ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పి అలరించాడు. ప్రేమ్‌ సాగర్‌ - నిరోషా - బిగ్ బాస్ దివి - అన్నపూర్ణమ్మ - రామారాజు - అప్పాజీ అంబరీశ్‌ - బిందు చంద్రమౌళి - సందీప్ వారణాసి - లావణ్య రెడ్డి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

‘మా నీళ్ళ ట్యాంక్’ సిరీస్ జులై 15 నుంచి జీ5 ఓటీటీలో ఎనిమిది ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్‌ కాబోతోంది. ‘వరుడు కావలెను’ ఫేమ్ లక్ష్మీ సౌజన్య ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ రొమాంటిక్ కామెడీ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ప్రవీణ్ కొల్లా నిర్మించారు.

రాజశ్రీ - సురేష్ మైసూర్ కథ అందించగా.. కిట్టు విస్సాప్రగఢ డైలాగ్స్ రాసారు. సునీల్ కశ్యప్ కంపోజ్ చేసిన సాంగ్ సినిమాటిక్ టచ్ ఇస్తుంది. అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ నిర్వహించిన ఈ సిరీస్ కు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేశారు.