Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా: పూజాహెగ్డే

By:  Tupaki Desk   |   17 Jan 2021 10:01 AM GMT
రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా: పూజాహెగ్డే
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'రాధేశ్యామ్.' స్వచ్ఛమైన ప్రేమకావ్యంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ టీజర్ కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి ఉన్నారు. కాగా.. ఈ చిత్రం గురించి, తన గురించి ఓ పోస్టు చేసింది పూజా.

పాన్ ఇండియన్ లెవెల్లో మంచి హైప్ ఏర్పడిన ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. త్వరలోనే షూట్ పూర్తి కానుంది. ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్టును త్వరగా ఫినిష్ చేసి, నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని చూస్తున్నాడు. సంక్రాంతి కానుకగా టీజర్ రిలీజ్ అవుతుందని భావించినప్పటికీ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.

కాగా.. లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది హీరోయిన్ పూజా హెగ్డే. ఈ ఫొటోలో కారు వెనుక సీట్లో కూర్చుంది పూజా. ఈ చిత్రానికి "రాధేశ్యాం సుదీర్ఘ 30 రోజుల షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ టూ ముంబై" అని క్యాప్షన్ రాసుకొచ్చింది పూజ.

పూజాహెగ్డే షెడ్యూలు పూర్తయిందంటే.. చిత్రీకరణ మరింత దగ్గరపడిందని భావించొచ్చు. ఈ లెక్కన టీజర్ కూడా అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. పాన్ ఇండియా లెవల్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై.. వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు.