Begin typing your search above and press return to search.

ఈగోను ఇంటి వ‌ద్దే వ‌దిలేసి రండి : స‌మంత‌

By:  Tupaki Desk   |   22 Jan 2022 3:50 AM GMT
ఈగోను ఇంటి వ‌ద్దే వ‌దిలేసి రండి : స‌మంత‌
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తోంది. వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. ఈ చిత్రంలో సామ్ తొలిసారి ప్ర‌త్యేక గీతంలో మెరిసిన విష‌యం తెలిసిందే. `ఊ..అంటావా మావ ఊహూ.. అంటావా..` ఓ రేంజ్ లో పాపుల‌ర్ అయింది. ఈ పాట కోసం భారీ స్థాయిలో పారితోషికం అందుకున్న స‌మంత ప్ర‌స్తుతం ఈ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోంది. ప్ర‌స్తుతం స‌మంత వెకేష‌న్ కోసం స్విట్జ‌ర్లాండ్ లో వుంది.

అక్క‌డి మంచు అందాల మ‌ధ్య సామ్ చేస్తున్న విన్యాసాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మంచు కొండ‌ల్లో స‌మంత కొత్త కొత్త విన్యాసాలు చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన సామ్ తాజాగా త‌ను మంచు కొండ‌ల్లో స్కీయింగ్ చేస్తూ విహ‌రిస్తున్న విన్యాసాల‌కు సంబంధించిన వీడియోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. `పుష్ప‌` స‌క్సెస్ తో మ‌ళ్లీ పాత జోష్ లోకి వ‌చ్చేసిన సామ్ కొత్త ఆట‌లు ఆడుతూ కొత్త విద్య‌లు నేర్చుకుంటోంది.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో నాగ‌చైత‌న్య‌తో విడాకుల కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన స‌మంత‌ని చాలా మంది నెటిజ‌న్స్ వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి దారుణంగ ట్రోల్ చేసిన విష‌యం తెలిసిందే. వీట‌న్నింటి నుంచి బ‌య‌ట‌ప‌డిన సామ్ ఇప్పుడు ఓ ప‌క్క వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తుంటే సామ్ మాత్రం అవేవీ ప‌ట్టించుకోకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ స్విట‌ర్జ‌ర్లాండ్ అందాల‌ను ఆస్వాదిస్తోంది.

అక్క‌డి మంచు కొండ‌ల్లో స‌రికొత్త ఆట స్కీయింగ్ ని నేర్చుకుంటూ విహంగంలా మంచు దుప్ప‌ట్ల‌పై విహ‌రిస్తూ దూసుకుపోతోంది. స్కీయింగ్ చేస్తూ ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ క్రీడా కారిణి త‌ర‌హాలో దూసుకుపోతున్న సామ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ వీడియోకు ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ ని కూడా జ‌త చేసింది. `ఈగోని ఇంటి వ‌ద్దే వ‌దిలేసి రండి అని చెప్పారు. ఎంత క‌రెక్ట్ మాట‌లు చెప్పారో క‌దా?.. అంటూ స‌మంత క్యాప్ష‌న్ ఇచ్చింది. అంతే కాకుండా న్యూ బిగినింగ్స్ (కొత్త ఆరంభం), స్కీయింగ్ `అంటూ ఈ వీడియోకు హ్యాష్ ట్యాగ్ ల‌ని జ‌త చేసింది.

స‌మంత ప్ర‌స్తుతం `య‌శోద‌` చిత్రంలో న‌టిస్తోంది. సూప‌ర్ నేచుర‌ల్ పవ‌ర్స్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీని శ్రీ‌దేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. సామ్ తో పాటు మ‌రో కీల‌క పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టిస్తోంది. ఇద‌గిలా వుంటే ఈ మూవీ త‌రువాత స‌మంత బాలీవుడ్ క్రేజీ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలింస్ లో మూడు మిందీ చిత్రాల‌కు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.