Begin typing your search above and press return to search.

ప్రభాస్ హీరోయిన్ టాలీవుడ్ రీఎంట్రీ చేయనుందా..??

By:  Tupaki Desk   |   14 May 2021 2:30 PM GMT
ప్రభాస్ హీరోయిన్ టాలీవుడ్ రీఎంట్రీ చేయనుందా..??
X
టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'వన్.. నేనొక్కడినే' సినిమాతో పరిచయమైంది హీరోయిన్ కృతిసనన్. మొదటి సినిమానే మహేష్ బాబు సరసన నటించేసరికి అమ్మడికి ఫుల్ క్రేజ్ వచ్చింది కానీ హిట్ అయితే పడలేదు. ఇప్పటివరకు తెలుగులో కృతి చేసింది రెండు సినిమాలే. వన్.. నేనొక్కడినే మూవీ తర్వాత కృతి.. అక్కినేని నాగచైతన్యతో 'దోచేయ్' సినిమా చేసింది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో కృతి వెంటనే బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన హీరోపంటి సినిమాతో డెబ్యూ చేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలను అందుకొని దూసుకుపోతుంది.

అలా అమ్మడికి బాలీవుడ్ లో బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. అందుకే వరుసగా హిట్స్ పడేసరికి బాలీవుడ్ హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. అలాగే డార్లింగ్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీతగా నటిస్తోంది కృతి. ప్రస్తుతం ఆదిపురుష్ తో పాటు పలు క్రేజీ సినిమాలను అమ్మడు లైన్ లో పెట్టింది. నిజానికి సినీ ఇండస్ట్రీలో అదృష్టం అనేది బాగా నమ్ముతుంటారు నటులు. ఎందుకంటే కొందరు ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే స్టార్డం అందుకొని బిజీ అయిపోతారు. కానీ కొందరు మాత్రమే మొదట్లో తడబడినా కొంతకాలానికి ఎప్పుడూ లేనివిధంగా బిజీ అయిపోతారు. ప్రస్తుతం ఆ దశలోనే ఉంది కృతిసనన్.

ఈ అమ్మడు తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించినప్పటికి సెటిల్ అవుతుంది మాత్రం బాలీవుడ్ లోనే. ప్రస్తుతం మోస్ట్ బిజీస్ట్ హీరోయిన్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. త్వరలోనే కృతి తెలుగులో కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుందట. ఎందుకంటే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పరిచయం చేసిన కృతి.. మళ్లీ ఆయన దర్శకత్వంలోనే రాబోతుందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్. మరి ఎప్పుడు అంటే మాత్రం.. అది విజయ్ దేవరకొండ లేదా రాంచరణ్ తో ఎవరైనా కావచ్చు అని క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సుక్కు అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ లేదా రాంచరణ్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడట. అయితే నెక్స్ట్ మూవీ హీరో ఎవరైనా హీరోయిన్ గా కృతిసనన్ వైపే సుక్కు లుక్కు వేసాడని పుకార్లు. మరి ఆదిపురుష్ తో అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ కాబోతుంది. చూడాలి తెలుగులో రీఎంట్రీ ఎప్పుడో..!