Begin typing your search above and press return to search.

మలయాళంలో టాలీవుడ్ నిర్మాత కళ్యాణం

By:  Tupaki Desk   |   14 July 2017 1:10 PM IST
మలయాళంలో టాలీవుడ్ నిర్మాత కళ్యాణం
X

కె.కె. రాధామోహన్ కు టాలీవుడ్ నిర్మాతగా బోలెడంత గుర్తింపు ఉంది. రవితేజతో బెంగాల్ టైగర్.. బాలకృష్ణతో అధినేత.. ఏమైంది ఈ వేళ వంటి చిత్రాలను నిర్మించిన రాధామోహన్ కు.. టేస్ట్ తో పాటు ట్యాలెంట్ ఉన్న నిర్మాతగా గుర్తింపు ఉంది. ఇప్పుడీయన మల్లూవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.

శ్రావణ్ ముఖేష్ ను హీరోగా పరిచయం చేస్తూ.. తెరకెక్కించనున్న సినిమాకు రాధామోహన్ నిర్మాణం వహించనున్నాడట. ఇలా ఓ కొత్త కుర్రాడిని పరిచయం చేస్తూ.. ప్రయోగం చేస్తున్నాడని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ శ్రావణ్ ఎవరో కాదు.. మలయాళ నటుడు ముకేష్.. ప్రముఖ నటి కం డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సరితల కుమారుడే. అంజుతే అతడి అరంగేట్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి. రాజేష్ నాయర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి కళ్యాణం అనే టైటిల్ ను నిర్ణయించారు. ఇప్పటికే క్యాస్టింగ్ వంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తియిపోగా.. ఈ వారం చివరలో మూవీ లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను 'కళ్యాణం' మూవీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 'రాజేష్ నాయర్ చెప్పిన స్టోరీ నాకు బాగా నచ్చింది. అందుకే మలయాళంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ కళ్యాణం అందరూ మెచ్చేలా ఉంటుందని ఘంటాపథంగా చెప్పగలను' అంటున్నారు నిర్మాత కె.కె. రాధా మోహన్.