Begin typing your search above and press return to search.

భార్యకోసం పాట పాడిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్!

By:  Tupaki Desk   |   30 April 2021 3:30 PM GMT
భార్యకోసం పాట పాడిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్!
X
స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ - అనుష్కశర్మ గురించి దేశంలో తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఒకరు భారత క్రికెట్ జట్టు రధసారథి.. మరొకరు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్ట్రెస్. వీరిద్దరూ కలిసి కొన్నాళ్ళ క్రితం ఓ కమర్షియల్ యాడ్ ద్వారా పరిచయమై ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్ ఆటగాడు మాత్రమే కాదు. ఆయనలో మల్టీటాలెంట్ దాగి ఉందని ఇటీవలే ఓ వీడియో ద్వారా ప్రపంచానికి తెలిసింది. అదేంటంటే.. 2017 డిసెంబర్ 11న విరాట్ - అనుష్క ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగాక అనుష్క కోసం విరాట్ ఓ బాలీవుడ్ సాంగ్ ఆలపించాడు. ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విరాట్ పెళ్లి పార్టీలో భార్య అనుష్కను ఉద్దేశించి.. 'మేరే మెహబూబ్ ఖాయమత్ హోగి' అనే పాటను పాడాడు. ఆ పాట విని అనుష్క చాలా భావోద్వేగానికి గురైంది. ఈ సీన్ అంతా మనం వారి ఫ్రెండ్స్ రికార్డు చేసిన వీడియోలో చూడవచ్చు. ఈ స్టార్ కపుల్ ఈ ఏడాది వారి కూతురు వామికకు స్వాగతం పలికారు. ఇప్పటివరకు వామిక ఫేస్ అయితే రివీల్ చేయలేదు. ఫిబ్రవరి 1న అనుష్క - విరాట్ కూతురు వామికతో ఫోటో షేర్ చేశారు కానీ అందులో కూడా పాప ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్ సీసన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అనుష్క ప్రస్తుతం కూతురును చూసుకుంటూ.. ఆమె ప్రొడక్షన్ లో కొత్త ప్రాజెక్ట్స్ నిర్మించే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం.