Begin typing your search above and press return to search.

'తెల్లవారితే గురువారం' హీరో శ్రీ సింహా కిడ్నాప్..!

By:  Tupaki Desk   |   20 March 2021 3:30 PM GMT
తెల్లవారితే గురువారం హీరో శ్రీ సింహా కిడ్నాప్..!
X
కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా ''తెల్లవారితే గురువారం''. మణికాంత్ జెల్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిషా నారంగ్ - చిత్రా శుక్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం - లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని కలిగించాయి. మార్చి 27న ఈ సినిమా విడుద‌లవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది. రేపు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్‌ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ప్లాన్ చేశారు. దీనికి చీఫ్ గెస్టులుగా దర్శకధీరుడు రాజమౌళి - యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు.

అయితే మరికొన్ని గంటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగుతుందనగా తాజాగా హీరో శ్రీ సింహా కిడ్నాప్ అయ్యాడంటూ చిత్ర యూనిట్ ఓ ఫన్నీ వీడియోని రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ మరియు రాజమౌళి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు 'ఆర్.ఆర్.ఆర్' అప్డేట్ కోసం శ్రీ సింహాని కిడ్నాప్ చేసినట్లు ఇందులో చూపించారు. శ్రీ సింహా మార్చి 27న RRR రిలీజ్ అవుతుందని చెప్పి తన సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు. చివరకు రేపు జరగబోయే 'తెల్లవారితే గురువారం' ఈవెంట్ కి ఎన్టీఆర్ అన్న - రాజమౌళి బాబాయ్ వస్తారని.. వారిద్దరిని మీ ముందు కూర్చో బెడతా అన్ని ప్రశ్నలను అక్కడ అడగొచ్చని మాస్కులు వేసుకున్న కిడ్నాపర్స్ ని సింహా మస్కా కొట్టించాడు. ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.