Begin typing your search above and press return to search.

బాలీవుడ్ బ్యూటీయే కావాలంటున్న మహేష్ అండ్ టీమ్...?

By:  Tupaki Desk   |   4 Jun 2020 2:30 AM GMT
బాలీవుడ్ బ్యూటీయే కావాలంటున్న మహేష్ అండ్ టీమ్...?
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో నటిస్తున్న 27వ సినిమా 'సర్కారు వారి పాట'. ఈ చిత్రానికి 'గీత గోవిందం' ఫేమ్ పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. తమన్ సంగీతం అందిస్తుండగా పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా ఏయస్ ప్రకాష్ పని చేస్తుండగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసింది. ఈ సినిమా సందేశాత్మక అంశాలతో తెరకెక్కబోతున్న కంప్లీట్ ఎంటర్టైనర్ అని మహేష్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో మరో హిట్ కొట్టడం ఖాయమని సూపర్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మహేష్‌ కి సరైన జోడీ ఎవరన్నది ఆసక్తిగా మారింది.

కాగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ మరోసారి మహేశ్ బాబుతో జతకట్టనుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకముందు వీరిద్దరూ కలిసి నటించిన 'భరత్ అనే నేను' చిత్రం మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ వీరి కాంబినేషన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించారట. బాలీవుడ్ బ్యూటీ అయితే మార్కెట్ పరంగా కూడా సినిమాకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారట. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతోందనీ.. ఈ సినిమా పట్ల కియారా కూడా ఆసక్తి చూపుతోందని సమాచారం. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ చిత్రం కోసం ఈ ముద్దుగుమ్మ డేట్స్ అడ్జస్ట్ చేసుకోనుందట. అయితే దీనికి సంభందించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజానికి మహేష్ ప్రతి సినిమాకి హీరోయిన్స్ విషయంలో ఎప్పుడూ సమస్య ఉంటుంది. మహేష్ ఛార్మింగ్ ముందు ఎంతటి బ్యూటీ అయినా తేలిపోతుంది. అందువలన హీరోయిన్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. అంతేకాకుండా మహేష్ ఒకరిద్దరు హీరోయిన్స్ ని తప్ప మళ్ళీ రిపీట్ చేయడు. మరి ఇప్పుడు ఈ భామ మహేష్ తో నటించి బ్లాక్ బస్టర్ అందుకోబోతుందేమో చూడాలి.