Begin typing your search above and press return to search.

చాలా కష్టాలు పడ్డానంటున్న మహేష్‌ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   18 July 2020 7:00 AM GMT
చాలా కష్టాలు పడ్డానంటున్న మహేష్‌ హీరోయిన్‌
X
బాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్‌ జాబితాలో కియారా అద్వానీ ఒకరు. ఈమె వరుసగా అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కబీర్‌ సింగ్‌ మరియు గుడ్‌ న్యూస్‌ లాంటి చిత్రాలు సక్సెస్‌ ఇవ్వడం మరియు లస్ట్‌ స్టోరీస్‌ వంటి వెబ్‌ సిరీస్‌ తో మంచి స్టార్‌ డం రావడంతో బాలీవుడ్‌ లో ఈమె టాప్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతోంది. ఇండస్ట్రీలో బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నా కూడా సొంత కష్టంతో అవకాశాలు దక్కించుకుని స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచిన కియారా అద్వానీ ప్రస్తుతం లక్ష్మీ బాంబ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.

ఆ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా కియారా అద్వానీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. నేను సినిమాల్లోకి వచ్చే వరకు నాకు ఇండస్ట్రీలో తెలిసిన వారు ఉన్నారనే విషయం తెలియదు. సయిద్‌ జాఫ్రీ.. అశోక్‌ కుమార్‌ లు నా ఫ్యామిలీకి చెందిన వారనే విషయం నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో నేను ఎప్పుడు ఎదగాలని కోరుకోలేదు. కెరీర్‌ ఆరంభం నుండి చాలా కష్టాలు పడుతూ ఆఫర్లు దక్కించుకున్నాను. సినిమా ఛాన్స్‌ ల కోసం చాలా ఆఫీస్‌ ల చుట్టు తిరిగానంటూ చెప్పుకొచ్చింది.

కబీర్‌ సింగ్‌.. గుడ్‌ న్యూస్‌ వంటి రెండు విభిన్నమైన చిత్రాల్లో ఆఫర్లు రావడంతో నా కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. ఆ రెండు సినిమాల్లో నా పాత్రలు చాలా డిఫరెంట్‌ గా ఉంటాయి. ఇక లస్ట్‌ స్టోరీస్‌ వెబ్‌ సిరీస్‌ కోసం కరణ్‌ జోహార్‌ ఉండి ఆఫర్‌ వచ్చిన వెంటనే లక్కీగా ఫీల్‌ అయ్యి ఒప్పుకున్నాను. ఆయన దర్శకత్వంలో నటించడం నా కెరీర్‌ కు బాగా ఉపయోగపడినట్లుగా భావిస్తున్నాను. ఇక నాకు పిల్లలు అంటే చాలా ఇష్టమని.. భవిష్యత్తులో తల్లిని అయ్యి పిల్లల ఆలన పాలన చూడాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.