Begin typing your search above and press return to search.

ఓటీటీ బాట పడుతున్న కీర్తి సినిమాలు!

By:  Tupaki Desk   |   24 May 2020 12:11 PM GMT
ఓటీటీ బాట పడుతున్న కీర్తి సినిమాలు!
X
ఒక వైపు థియేటర్లలోనే తమ సినిమాలను రిలీజ్ చేస్తామని కొందరు నిర్మాతలు పట్టుదలగా ఉన్నారు కానీ కొందరు చిన్న.. మీడియం సినిమాల నిర్మాతలు మాత్రం ఓటీటీకి ఓటేస్తున్నారు. కీర్తి సురేష్ నటించిన తమిళ చిత్రం 'పెంగ్విన్' డిజిటల్ రిలీజుకు మంచి ఆఫర్ రావడంతో అమెజాన్ ప్రైమ్ వీడియోకు రైట్స్ ఇచ్చారు. ఈ సినిమా జూన్ 19 న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజ్ అవుతోంది.

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ను కార్తీక్ సుబ్బరాజ్ స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. కీర్తికి తమిళ నాట మంచి క్రేజ్ ఉన్నప్పటికీ 'పెంగ్విన్' ఇలా ఓటీటీ రిలీజ్ కు పోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమానే కాకుండా కీర్తి నటిస్తున్న మరో రెండు తెలుగు సినిమాలకు ఓటీటీల నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయట. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గుడ్ లక్ సఖి'.. నరేంద్రనాథ్ దర్శకత్వంలో 'మిస్ ఇండియా' సినిమాల షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఈ సినిమాలకు డిజిటల్ రిలీజ్ కోసం మంచి ఆఫర్లు వస్తున్నాయని.. 'పెంగ్విన్' రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ను చూసుకుని ఓటీటీ రిలీజ్ విషయంలో నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

'పెంగ్విన్' సక్సెస్ అయితే ఆ రెండు సినిమాలు ఓటీటీ లో రిలీజ్ కావడం ఖాయమని అంటున్నారు. ఇవే కాకుండా జ్యోతిక నటించిన 'పొన్ మగళ్ వందాల్' మే 29 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతోంది. మరో నెలలోపు ఎలాగూ థియేటర్లు ఓపెన్ అయ్యే సూచనలు లేవు కాబట్టి ఈ సినిమాలు సక్సెస్ అయితే ఇతర సినిమాల కూడా ఓటీటీ బాట పడతాయని అంటున్నారు.