Begin typing your search above and press return to search.

మామిడి రసం సుందరికి ఏమైంది?

By:  Tupaki Desk   |   15 Aug 2017 9:50 AM GMT
మామిడి రసం సుందరికి ఏమైంది?
X
హీరోయిన్లు ఏమిన్న అది ఒక న్యూస్ అవుతుంది వాళ్ళు ఏమి చెప్పిన దాన్ని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు మనదేశంలో. అందులోనూ స్టార్ హీరోయిన్ అయితే వాళ్ళ ప్రతి కదలికను మీడియా ఫాలో చేస్తుంది. సినిమాలు వలన మన హీరోయిన్లు ఎంత ఫేమస్ అవుతారో వాళ్ళ ఫోటో షూట్లు వలన మీడియా ముందు వాళ్ళు అన్న మాటలు వలనకూడ అంతే ఫేమస్ అవుతారు. ఇలానే ఈ మధ్య బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ తన భావాన్ని ఆమె అభిమానులతో పంచుకొని సోషల్ మీడియాలో న్యూస్ అయ్యింది.

ఎప్పుడూ ఏదో ఒక గొప్ప వాక్యం కానీ ఆమె జీవితంలో ఒక గొప్ప సంఘటన కానీ తన అభిమానులతో పంచుకుంటూ వస్తుంది ఈ మామిడి రసం సుందరి. ఇప్పుడు మరోసారి అలానే చేసింది కానీ అది దేని గురించి చెప్పిందో ఏమి చెప్పిందో కొంతమందికి అర్ధాంకాక ఆమెలానే కన్ఫుజ్ అయ్యారు. కత్రినా కైఫ్ ఏమి అంటుంది అంటే “ నీకు ఒకటి అనిపిస్తే అది నిజమే - నీకు ఒకటి కావాలి అనిపిస్తే దాన్ని దక్కించుకో ” అని చెప్పింది. అయితే ఇప్పుడు కత్రినా కైఫ్ కు ఏమి అనిపించిందో ఏమి కావాలి అనిపిస్తుందో ఎవరికి అర్ధంకావటం లేదు.

కత్రినా కైఫ్ తన రియల్ ప్రేమ కథ రణబీర్ కపూర్ తో ఘోరంగా విఫలమైంది. అలానే కత్రినా తాజాగా నటించిన జగ్గా జాసూస్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తో రొమాన్స్ చేసిన ప్రేక్షకులు ఈ సినిమాను అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు తన రాబోతున్న సినిమా పై కత్రినా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా. ‘టైగర్ జిందా హై’ సినిమా షూటింగ్లో ఇప్పుడు కత్రినా కైఫ్. సల్మాన్ భాయ్ బిజీ గా ఉన్నారు. ​