Begin typing your search above and press return to search.

లెజెండరీ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   9 April 2021 7:16 AM GMT
లెజెండరీ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్..!
X
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ''పొన్నియన్‌ సెల్వన్‌'' అనే పీరియాడికల్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కోలీవుడ్ స్టార్స్ విక్రమ్ - కార్తీ - జయం రవి - విక్రమ్ ప్రభు.. ఐశ్వర్యారాయ్ - త్రిష - శోభితా ధూళిపాళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. క‌రోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరగడంతో మధ్యప్రదేశ్‌ లో ప్లాన్ చేసిన షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడితే చెన్నై - హైదరాబాద్ - రాజమండ్రి ప్రాంతాలలో ఈ మూవీ షూటింగ్ జరగనుంది. అయితే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'పొన్నియన్‌ సెల్వన్‌' సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై హీరో కార్తీ స్పందించారు.

'సుల్తాన్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కార్తీ మాట్లాడుతూ.. 'పొన్నియన్‌ సెల్వన్‌' చిత్రీకరణ ఇప్పటికే 70 శాతం పూర్తయిందని తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ పండుగ సీజన్ లో ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని కార్తీ వెల్లడించారు. కాగా, చోళుల కాలం నాటి కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.