Begin typing your search above and press return to search.

నిన్న ర‌ష్మిక మంద‌న్న‌.. ఇప్పుడు ప్ర‌శాంత్ నీల్‌!

By:  Tupaki Desk   |   20 Oct 2022 10:30 AM GMT
నిన్న ర‌ష్మిక మంద‌న్న‌.. ఇప్పుడు ప్ర‌శాంత్ నీల్‌!
X
ఒక భాష‌లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న వారిపై అక్క‌డి ప్రేక్ష‌కులు అమిత‌మైన ప్రేమ‌ని, అభిమానాన్ని చూపిస్తుంటారు.. కానీ కన్న‌డ ప్రేక్ష‌కులు, అభిమానులు మాత్రం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పై నిప్పులు చెరుగుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. కేజీఎఫ్ సిరీస్ సినిమాల‌తో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాల రిలీజ్‌ వ‌ర‌కు క‌న్న‌డ సినిమా.. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ గురించి మాట్లాడ‌ని సినీ ప్రియులు ఇప్ప‌డు చ‌ర్చించుకుంటున్నారు.

'కేజీఎఫ్‌' త‌రువాత క‌న్న‌డ సినిమా రిలీజ్ అవుతోందంటే దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తూ హీరో ఎవ‌రు? .. డైరెక్ట‌ర్ ఎవ‌రు? .. స్టోరీ ఏంటీ అని ఆరాతీయ‌డం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో 'కేజీఎఫ్' తరువాత విడుద‌లైన క‌న్న‌డ సినిమాలు సైతం దేశ వ్యాప్తంగా మంచి విజ‌యాల్ని సొంతం చేసుకుంటూ క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి మంచి పేరు తెచ్చి పెడుతున్నాయి. కేజీఎఫ్ త‌రువాత విడుద‌లైన 'చార్లీ 777', విక్రాంత్ రోణ.. రీసెంట్ గా రిష‌బ్ శెట్టి న‌టించి తెర‌కెక్కించిన 'కాంతార‌' వ‌ర‌కు అన్ని సినిమాలు కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు గా నిలిచి సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

ప్ర‌శాంత్ నీల్ నుంచి రిష‌బ్ శెట్టి వ‌ర‌కు అంతా త‌మ సినిమాల‌తో క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి దేశ వ్యాప్తంగా పేరు తీసుకొస్తున్న వేళ క‌న్న‌డ ప్రేక్ష‌కులు, అభిమానులు మాత్రం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌పై మండిప‌డుతున్నార‌ట‌. కార‌ణం 'కేజీఎఫ్‌'తో క‌న్న‌డ ఇండ‌స్త్రీ దేశ వ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చేలా చేసినా క‌న్న‌డ‌లో మాత్రం సినిమా చేయ‌డం లేద‌ని మండిప‌డుతున్నార‌ట‌. క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న 'కాంతార‌' ఫేమ్ రిష‌బ్ శెట్టి డైరెక్ట్ చేసిన‌ క‌న్న‌డ సినిమా 'కిరిక్ పార్టీ'తో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది. స్వ‌త‌హాగా క‌న్న‌డ కావ‌డం తెలిసిందే.

అయితే ఈ మూవీ త‌రువాత తెలుగులో 'ఛ‌లో'తో ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక 'పొగ‌రు' త‌రువాత క‌న్న‌డ సినిమాకు దూరంగా వుంటోంది. అంతే కాకుండా క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టితో త‌న ఎంగేజ్ మెంట్ ని క్యాన్సిల్ చేసుకుని తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తోంది.

దీంతో క‌న్న‌డ సినిమాల‌ని చేయ‌డం లేద‌ని మండిప‌డిన అభిమానులు ఇప్ప‌డు ప్ర‌శాంత్ నీల్ వెంట‌ప‌డుతూ ట్రోల్ చేస్తున్నార‌ట‌. ఇలా తెలుగులో సినిమా హిట్ అయిన ప్ర‌తీ ద‌ర్శ‌కుడు, స్టార్ క‌న్న‌డ‌ని వ‌దిలేస్తే ఎలా అంటూ మండిప‌డుతున్నార‌ట‌.

తాజాగా 'కాంతార‌'తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న రిష‌బ్ శెట్టి తో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ త్వ‌ర‌లో సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో క‌న్న‌డ అభిమానులు రిష‌బ్ శెట్టిని రిక్వెస్ట్ చేస్తూ క‌న్న‌డ‌ని వ‌ద‌ల‌కండి అంటూ పోస్ట్ లు పెడుతూ ట్యాగ్ చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో అల్లు అర‌వింద్ చెప్పిన‌ట్టుగా రిష‌బ్ శెట్టి తెలుగు ప్రాజెక్ట్ చేస్తాడా? లేక దాన్నే క‌న్న‌డ‌లో చేసి తెలుగులో డ‌బ్ చేద్దామంటాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.