Begin typing your search above and press return to search.

'స్టార్ హీరోలందరూ దాక్కుంటే.. నేను 100 కోట్ల సినిమాతో వస్తున్నా'

By:  Tupaki Desk   |   1 April 2021 6:58 AM GMT
స్టార్ హీరోలందరూ దాక్కుంటే.. నేను 100 కోట్ల సినిమాతో వస్తున్నా
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ''తలైవి''. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఎ.ఎల్. విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. విష్ణువర్థన్ ఇందూరి - శైలేష్ ఆర్. సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 23న ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే కోవిడ్ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలన్నీ వాయిదా పడుతుండటంతో 'తలైవి' కూడా పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం చెప్పిన తేదీకే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇదే విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే ఈ ట్వీట్ ని రీట్వీట్ చేసిన హీరోయిన్ కంగనా రనౌత్.. బాలీవుడ్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది. "వారు నన్ను వేధించారు. గ్యాంగ్ అప్ చేశారు. ఇండస్ట్రీ నుంచి తరిమికొట్టడానికి ప్రతిదీ చేసారు. అయితే ఈ రోజు బాలీవుడ్ టేకేధార్స్ కరణ్ జోహార్ - ఆదిత్య చోప్రా మరియు పెద్ద హీరోలందరూ దాక్కున్నారు. కానీ కంగనా రనౌత్ తన బృందంతో కలిసి బాలీవుడ్ ను కాపాడటానికి 100 కోట్ల బడ్జెట్ సినిమాతో వస్తోంది'' అని కంగనా పేర్కొంది. బుల్లీవుడ్ చిల్లర్ పార్టీ అంటూ ఘాటు కామెంట్స్ చేసిన కంగానపై వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.