Begin typing your search above and press return to search.

ఇజం తర్వాత ఇంటెలిజెస్స్ పెరిగింది

By:  Tupaki Desk   |   3 Dec 2016 11:59 AM IST
ఇజం తర్వాత ఇంటెలిజెస్స్ పెరిగింది
X
నందమూరి కళ్యాణ్ రామ్ తన రేంజ్ కి మించి సాహసాలు ఎక్కువగా చేయడు. ఓం త్రీడీ లాంటి మూవీస్ ఉన్నా.. అవీ ఒకటీ అరా మాత్రమే. కానీ పూరీ జగన్నాధ్ తో సినిమా కోసం చాలానే బడ్జెట్ పెట్టేశాడు నందమూరి. పూరీ రెమ్యూనరేషన్ తో పాటు.. ప్రీరిలీజ్ ప్రమోషన్స్ కు కూడా పెద్ద మొత్తంలోనే వెచ్చించాడు.

ఎన్ని చేసినా థియేటర్ల దగ్గర మాత్రం ఇజం వర్కవుట్ కాలేదు. ఆడియన్స్ ను కౌంటర్లలో టికెట్లు కొనిపించే సత్తా ఈ సినిమాకి లేకపోయింది. అటు హీరోగాను.. ఇటు నిర్మాతగాను ఎదురుదెబ్బ తిన్నాడు. ఇజం ఒక్కమూవీకి పెట్టిన బడ్జెట్ తో.. కళ్యాణ్ రామ్ తన రేంజ్ మూవీస్ 5-6 తీసేయచ్చని అంటారు ఇండస్ట్రీ జనాలు. దీనికి ముందు కిక్2 రూపంలో కూడా పెద్ద దెబ్బే తగిలింది. ఈ రెండు నష్టాల నుంచి కోలుకోవాలంటే.. ఎన్టీఆర్ తో సినిమా చేయక తప్పదు.

అయితే.. ఇప్పుడు మాత్రం కళ్యాణ్ రామ్ ఓ ఫైనల్ నిర్ణయానికి వచ్చేశాడట. తన బడ్జెట్ కి మించి ఒక్క రూపాయి కూడా పెట్టే సమస్యే లేదని తేల్చేస్తున్నాడట. ఇజం దెబ్బకి.. కళ్యాణ్ రామ్ కి బోలెడంత ఇంటెలిన్స్ బయటకొచ్చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/