Begin typing your search above and press return to search.
ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత
By: Tupaki Desk | 28 May 2020 5:45 AM GMTనందమూరి ఫ్యాన్స్ మరియు తెలుగు వారికి నేడు పండుగ. ఈ సందర్బంగా నందమూరి ఫ్యామిలీ హీరోలు మరియు ఫ్యాన్స్ అన్నగారిని గుర్తు తెచ్చుకోవడంతో పాటు ఆయన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో జోహార్ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. తాత ఎన్టీఆర్ జయంతి సందర్బంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీరు లేని లోటు తీరనిది అంటూ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
ఎన్టీఆర్ ట్విట్టర్ లో ఇంకా... మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా సదా మీ ప్రేమకు బానిసను.. అంటూ పేర్కొన్నాడు. ఎన్టీఆర్ ట్వీట్ కు భారీ స్పందన వచ్చింది. ప్రస్తుత విపత్తు సమయంలో ఎన్టీఆర్ సమాధి వద్దకు వెళ్లడం అన్ని విధాలుగా కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు ఈ సారి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించేందుకు వెళ్లలేదు.
ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్దకు బాలకృష్ణ మరియు ఆయన కుటుంబ సభ్యులు వెళ్లి నివాళ్లు అర్పించారు. నందమూరి సుహాసినితో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళ్లు అర్పించారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు.
ఎన్టీఆర్ ట్విట్టర్ లో ఇంకా... మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా సదా మీ ప్రేమకు బానిసను.. అంటూ పేర్కొన్నాడు. ఎన్టీఆర్ ట్వీట్ కు భారీ స్పందన వచ్చింది. ప్రస్తుత విపత్తు సమయంలో ఎన్టీఆర్ సమాధి వద్దకు వెళ్లడం అన్ని విధాలుగా కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు ఈ సారి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించేందుకు వెళ్లలేదు.
ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్దకు బాలకృష్ణ మరియు ఆయన కుటుంబ సభ్యులు వెళ్లి నివాళ్లు అర్పించారు. నందమూరి సుహాసినితో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళ్లు అర్పించారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు.