Begin typing your search above and press return to search.

#YRF ప‌ఠాన్ .. షారూక్ ని ఢీకొట్టేది అత‌డేన‌ట‌

By:  Tupaki Desk   |   5 Nov 2020 1:30 AM GMT
#YRF ప‌ఠాన్ .. షారూక్ ని ఢీకొట్టేది అత‌డేన‌ట‌
X
ధూమ్.. కాబూల్ ఎక్స్ ప్రెస్.. న్యూయార్క్ లాంటి సినిమాల‌తో య‌ష్ రాజ్ సంస్థ‌కు అత్యంత ఆప్తుడిగా కండ‌ల హీరో జాన్ అబ్రహం పాపుల‌ర‌య్యారు. ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ చిత్రం `పఠాన్` తో YRF శిబిరంలో తిరిగి జాయిన్ అయ్యాడు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కు విలన్ గా అత‌డు న‌టించ‌నున్నాడు. జీరో తర్వాత SRK పునరాగమనం య‌ష్ రాజ్ సంస్థ‌లో జ‌రుగుతుండ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. జాన్ అబ్రహం పఠాన్ మూవీకి భారీ మొత్తంలో పారితోషికం వ‌సూలు చేయ‌నున్నాడ‌ని బాలీవుడ్ స‌ర్కిల్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

``జాన్ ప్రస్తుతం తన సోలో చిత్రాల బాక్సాఫీస్ విజయాలతో తన కెరీర్లో ఉత్తమ దశలో ఉన్నాడు. అతను తన భుజాలపై సినిమాని మోయ‌గ‌ల స‌మ‌ర్థుడిగా నిరూపించుకున్నాడు. అందువల్ల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న య‌ష్ రాజ్ చిత్రం కోసం అతను తన ఫీజును పెంచాడు. జాన్ ‌కు దాదాపుగా 20 కోట్లు చెల్లించ‌నున్నార‌ని తెలుస్తోంది. పఠాన్ లో నెగెటివ్ లీడ్ కోసం 60 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు`` అని ప్ర‌ముఖ జాతీయ మీడియా వెల్ల‌డించింది.

జాన్ అబ్రహాం త‌న కెరీర్ లో మ‌రో డైనమిక్ పాత్రతో మెరుపులు మెరిపిస్తాడ‌ని షారూక్ పాత్ర‌తో పోటీప‌డే విధంగా ఉంటుంద‌న్న స‌మాచారం రివీలైంది. షారుఖ్ ఖాన్ తో కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు నాటకీయ సన్నివేశాలతో ర‌క్తి క‌ట్టించ‌నున్నాడ‌ట‌.

జాన్ ప్రస్తుతం సత్యమేవ జయతే 2 చిత్రీకరణలో ఉన్నాడు. దానిని పూర్తి చేసి `ఏక్ విలన్ 2` సెట్స్ కి వెళ్తాడు. చివరగా.. జనవరి చివరి నాటికి అతను పఠాన్ సెట్స్ లో తన పనిని ప్రారంభిస్తాడు. అతను ఈ టీమ్ తో విదేశాలకు వెళ్తాడని భావిస్తున్నారు.

నవంబర్ చివరి నాటికి షారుఖ్ ఖాన్ పై సోలో సన్నివేశాలను ముంబైలో చిత్రీక‌రిస్తారు. వై.ఆర్.‌ఎఫ్ సంస్థ 50 సంవత్సరాల జ‌ర్నీని పూర్తి చేసిన సంద‌ర్భంగా షారూక్ - జాన్ అబ్ర‌హాం-దీపిక‌ కాంబినేష‌న్ లో ఈ మూవీని ప్లాన్ చేస్తుండ‌డం ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది.