Begin typing your search above and press return to search.

జయప్రకాష్‌ రెడ్డి అంత్యక్రియలు పూర్తి

By:  Tupaki Desk   |   8 Sep 2020 3:30 PM GMT
జయప్రకాష్‌ రెడ్డి అంత్యక్రియలు పూర్తి
X
నేడు తెల్లవారు జామున గుంటూరులోని తన నివాసంలో మృతి చెందిన ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్‌ రెడ్డి అంత్య క్రియలు పూర్తి అయ్యాయి. కరోనా కారణంగా అతి తక్కువ మంది సమక్షంలో ఈ అంత్య క్రియలు జరిగాయి. గుంటూరులోని కొరిటి పాడు స్మశాన వాటికలో జేపీ అంత్యక్రియలు నిర్వహించారు. జేపీ తనయుడు కరోనా పాజిటివ్‌ అవ్వడంతో గుంటూరులోని ఒక ఆసుపత్రిలో భార్యతో పాటు చికిత్స పొందుతున్నాడు. ఆ కారణంగా తండ్రి అంత్యక్రియలకు ఆయన హాజరు కాలేక పోయాడు.

కొద్ది మంది అభిమానులు బంధుమిత్రులు కలిసి అంతిమ యాత్రను నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎక్కవ మంది హాజరు కావద్దనే ఉద్దేశ్యంతో పోలీసు ఉన్నతాధికారులు స్పీడ్‌ గా అంతిమ యాత్రను కొనసాగించారు. స్మశాన వాటికలో కూడా కొద్ది మందిని మాత్రమే అనుమతించడంతో చాలా మంది అభిమానులు జేపీని చివరి చూపు చూడకుండా నిరుత్సాహంగా వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. జేపీకి టాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ మరియు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ప్రముఖులు నివాళ్లు అర్పించారు.