Begin typing your search above and press return to search.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న జాన్వీ సినిమా...!

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:30 PM GMT
ఓటీటీలో రిలీజ్ కాబోతున్న జాన్వీ సినిమా...!
X
'అతిలోక సుందరి' శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'దఢఖ్' సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. మరాఠీ సినిమా 'సైరాత్' కి రిమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు. అయితే అమ్మడు తన నటనతో గ్లామర్ తో మంచి గుర్తింపునే దక్కించుకుంది. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ కపూర్ ఆ తరువాత 'ఘోస్ట్ స్టోరీస్' అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. అనంతరం 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ బయోపిక్ గతేడాది డిసెంబర్ లోనే పూర్తయింది. అయితే ఇండస్ట్రీలో నెలకొనియున్న పరిస్థితుల వలన రిలీజ్ కాలేదు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

కాగా తాజాగా లేడీ ఓరియంటెడ్ మూవీ ''గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'' మూవీ ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ నెట్‌ ఫ్లిక్స్‌ లో విడుదల చేయనున్నారు. థియేటర్స్ లో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘గుంజన్ సక్సెనా’ అని చెప్పవచ్చు. ఇప్పటికే అమితాబ్ - ఆయుష్మాన్ ఖురానా నటించిన 'గులాభో సితాబో' సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గుంజన్ సక్సేనా రిలీజ్ పై ఒక వీడియో ద్వారా కరణ్ జోహార్ క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోకు జాన్వీ కపూర్ కూడా వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే బీటౌన్ సమాచారం ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని క్రేజీ హీరోయిన్ గా మారిపోవాలనుకున్న జాన్వీ కపూర్ కి 'గుంజన్ సక్సేనా' ఓటీటీ రిలీజ్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో చూడాలి.