Begin typing your search above and press return to search.

మాలో ప్రవహించేది ఒకే రక్తం...

By:  Tupaki Desk   |   4 Jan 2019 1:30 AM GMT
మాలో ప్రవహించేది ఒకే రక్తం...
X
తల్లి మరణం ఎవరికైనా తీరని లోటే. ఆ లోటును భర్తీ చేసే వారు మరెవ్వరు ఉండరు. ఆ విషయాన్ని జీర్ణించుకుని జాన్వీ కపూర్‌ మరియు ఖుషీ కపూర్‌ లు మెల్ల మెల్లగా సాదారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా హీరోయిన్‌ గా మంచి క్రేజ్‌ ను దక్కించుకున్న శ్రీదేవి మరణంతో ఆమె అభిమానులు తల్లడిల్లి పోయారు. ఇక ఆమె కుటుంబ సభ్యులు మరింతగా శోఖ సంద్రంలో మునిగి పోయారు. తల్లి మరణంతో జాన్వీ కపూర్‌ మరియు ఖుషీ కపూర్‌ లు చాలా నష్ట పోయారని చెప్పాలి. తల్లి అవసరం ఎక్కువగా ఉండే వయసు అది. పిల్లల ఎదుగుదల చూడకుండా శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయింది.

తల్లి మరణం తర్వాత జాన్వీ కపూర్‌ దాదాపు నాలుగు నెలల పాటు ఏం జరుగుతుంది, ఎవరితో మాట్లాడుతున్నా, ఎలా కాలం గడుస్తుందనే విషయాలు తెలియకుండానే జరిగి పోయిందట. తాజాగా ఒక మీడియా సంస్థతో జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ... అమ్మ మరణం నుండి నేను ఇంకా పూర్తిగా తేరుకోలేదని చెప్పాలి. అమ్మ మరణం తర్వాత నాలుగు నెలలు ఏం జరిగిందో కూడా ఇప్పుడు నాకు గుర్తు లేదు. అమ్మ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉండేవి. శ్రీదేవి మరణం తర్వాత బోణీ కపూర్‌ పెద్ద భార్య పిల్లలు, జాన్వీ మరియు ఖుషీ కపూర్‌ లతో కలిశారు.

ఆ సమయంలో నేను రూంలో ఉన్న సమయంలో అర్జున్‌ భయ్య మరియు అన్షులా దిదీు వచ్చారు. ఆ విషయం ఎప్పుడు మర్చిపోలేను. వారు మాతో కలవడం జరిగింది. అమ్మ చనిపోయినప్పు వారు చాలా సపోర్ట్‌ గా నిలిచారు. మా అందరిది కూడా ఒకే రక్తం, అందుకే ఆ సమయంలో మేము అంతా కలిశాం అంది. గత ఏడాది హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోయిన్‌ గా నటిస్తోంది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా త్వరలోనే హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.