Begin typing your search above and press return to search.

నెటిజ‌నుల చీవాట్ల‌కు త‌త్త‌ర‌ప‌డిన న‌ట‌వార‌సురాలు

By:  Tupaki Desk   |   5 May 2021 10:54 AM GMT
నెటిజ‌నుల చీవాట్ల‌కు త‌త్త‌ర‌ప‌డిన న‌ట‌వార‌సురాలు
X
క‌రోనా వైర‌స్ క‌ల్లోలంతో జ‌నం మ‌ర‌ణిస్తున్నారు. ఆస్ప‌త్రులు మ‌ర‌ణ శ‌య్య‌లుగా మారాయి. ఇలాంటి దారుణ స్థితి కొన‌సాగుతుంటే సెల‌బ్రిటీల వెకిలి వేషాలేమిటో అర్థం కావ‌డం లేదంటూ వాపోతున్నారు. నిరంత‌రం బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో పార్టీల‌తో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ క‌థానాయిక‌ల్ని ఫేజ్ 3 సెల‌బ్రిటీల్ని నెటిజ‌నులు తూర్పార‌బ‌డుతున్నారు.

ఇంత‌కుముందు మాల్దీవుల విహారానికి వెళ్లిన ప‌లువురు సెల‌బ్రిటీల్ని విప‌రీతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు జాన్వీ క‌పూర్ వంతు. జాన్వీ ఇటీవ‌ల ఇన్ స్టా వేదిక‌గా వ‌రుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. మొన్న‌టికి మొన్న మాల్దీవుల విహారంలో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన వ‌రుస ఫోటోల్ని షేర్ చేయ‌గా అవి యూత్ లో వైర‌ల్ అయ్యాయి.

అయితే చాలా మంది నెటిజ‌నులు జాన్వీని ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల జీవ‌నం స్థంబించి అల్ల‌క‌ల్లోలంగా ఉంటే ఇలాంటి ఫోటోల్ని షేర్ చేస్తావా? అంటూ ప‌లువురు తీవ్రంగా తిట్టేస్తున్నారు. సంద‌ర్భోచితంగా ప్ర‌వ‌ర్తించ‌డం సెల‌బ్రిటీల‌కు తెలియ‌దా? అన్న‌ది వారి ఆవేద‌న‌. అయితే తాజాగా తాను షేర్ చేసిన ఆ ఫోటోలు త్రోబ్యాక్ ఫోటోల‌ని ఇప్ప‌టి ఫోటోషూట్ కాద‌ని జాన్వీ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. అయితే ఫోటోషూట్ ఎప్ప‌టిది అయినా ప్ర‌స్తుత మార‌ణ‌హోమంలో ఇలాంటివి త‌గ‌ద‌నేది మెజారిటీ ప్ర‌జ‌ల అభిప్రాయం.