Begin typing your search above and press return to search.

ఈ కుర్రభామకు సముద్రపు ఒడ్డు కూడా ఇల్లులాగే ఉందట!

By:  Tupaki Desk   |   25 March 2021 10:30 AM GMT
ఈ కుర్రభామకు సముద్రపు ఒడ్డు కూడా ఇల్లులాగే ఉందట!
X
సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల పిల్లలు చేసే సందడి చాలా ముచ్చటగా ఉంటుంది. అదే సెలబ్రిటీ కూతురు పెరిగి హీరోయిన్ గా సినిమాల్లో రాణిస్తే.. ఆదరిస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఫేవరేట్ హీరోయిన్ కూతురుగా ఆదరించిన ప్రేక్షకులు.. ఇప్పుడు అదే కూతురు హీరోయిన్ గా సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు ఆదరిస్తున్నారు కూడా. ఆమె ఎవరో కాదు శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్. ఈమె ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది. ధడక్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ.. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుస అవకాశలతో బిజీగా గడుపుతోంది. ఇటీవలే రూహి అనే హారర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

అయితే సోషల్ మీడియాలో జాన్వీకి ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో అందరికి తెలిసిందే. అందుకే సోషల్ మీడియాను ఏ విధంగా వాడుకోవాలో అదేవిధంగా వాడుకుంటోంది జాన్వీ. తాజాగా జాన్వీ తను టూర్ కు వెళ్లిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఆ ఆ ఫోటోలు చూస్తే జాన్వీ ఓ సముద్రం వద్దకు వెళ్లినట్లే అనిపిస్తుంది. అక్కడే సముద్రం ఒడ్డున రాళ్ల మధ్య ఫోటోలకు పోజిచ్చింది అమ్మడు. ఆమెతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారట. అందమైన సముద్రం బీచ్ వద్ద జాన్వీ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ప్లేస్ ఎక్కడ అనేది మెన్షన్ చేయలేదు కానీ ఫోటోలలో మాత్రం జాన్వీ మెరిసిపోతుంది. ప్రస్తుతం జాన్వీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే జాన్వీ ఇప్పుడు దోస్తానా-2 సినిమా షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.