Begin typing your search above and press return to search.

ఏఎన్నార్ ఎన్టీఆర్ నాపై కోప్పడ్డారు

By:  Tupaki Desk   |   23 Dec 2017 2:30 AM GMT
ఏఎన్నార్ ఎన్టీఆర్ నాపై కోప్పడ్డారు
X
అందంగా ఉండే ఇల్లాలి పాత్రలో అయినా గడసారి పల్లెటూరి అమ్మాయిలా అయినా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మదిలో ఇప్పటికి ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గ్రేట్ యాక్టర్ జామున గారు. తెలుగు జాతి గర్వించదగ్గ ఏఎన్నర్ - ఎన్టీఆర్ వంటి వారితో సమానంగా స్టార్ డమ్ ని తెచ్చుకొని దాదాపు 195 సినిమాల్లో నటించారు. ఇక సీనియర్ హీరోయిన్స్ తో కూడా ఆమె చాలా క్లోజ్ గా ఉండేవారు. ముఖ్యంగా అలనాటి అందాల జాబిలి మహానటి సావిత్రి గారికి జమున గారికి విడదీయలేని అనుబంధం ఉండేది.

ఇక అసలు విషయానికి వస్తే.. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఎవరు ఊహించని విదంగా ఒక వివాదాన్ని గురించి కూడా ఆమె బయటపెట్టారు. కొంచెం వివాదస్పదం అంటూనే వివరించారు.. అప్పట్లో ఎన్టీఆర్ - ఏఎన్నార్ ఇద్దరు కలిసి నన్ను సినిమాల నుంచి బహిష్కరించాలని చూశారని చెప్పారు. ఎందుకంటే.. ఆమె టైముకు రాదు.. కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. మోస్ట్‌ ట్రబుల్‌ సమ్‌ క్యారెక్టర్‌ అని చాలా రకాలుగా ఒకరికి ఒకరు అనుకోని ఆమెకు బుద్ధి చెప్పాలంటే మనమిద్దరం కలవాలని ఏఎన్నార్ - ఎన్టీఆర్ అనుకున్నారు అంటూ జమున వివరించారు.

ఇక ఆ తర్వాత నేను ఏ మాత్రం తగ్గలేదు. నాకు వచ్చే అవకాశాలు వస్తాయి అంటూ.. దాదాపు మూడేళ్ల వరకు వారితో పోటీగా సినిమాలను చేశాను. డిస్ట్రిబ్యూటర్స్ వారి సినిమాలతో సమానంగా నా సినిమాలను కొనుక్కున్నారు. అయితే ఆ తర్వాత నాగిరెడ్డి గారు చక్రపాణి గారు పిలిచి సంధి చేయడంతో గుండమ్మ కథ చేశాను అంటూ ఆ నాటి అలకల గురించి నవ్వుతూ చెప్పారు.