Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ లో అలా బిజీ అయిన ఇస్మార్ట్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   20 April 2020 4:45 AM GMT
లాక్‌ డౌన్‌ లో అలా బిజీ అయిన ఇస్మార్ట్‌ బ్యూటీ
X
ఎప్పుడు షూటింగ్స్‌ అని.. లేదంటే ఏదో ఒక కార్యక్రమం అంటూ బిజీ బిజీగా గడిపే సెబ్రెటీలు దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు. కనీసం ఇంటినుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దాంతో ఇంట్లోనే రకరకాలుగా పనులు చేస్తూ గతంలో ఎప్పుడు చేయని కొత్త కొత్త ప్రయోగాలను ఇంట్లో చేస్తూ టైం పాస్‌ చేస్తున్నారు. కొందరు సెలబ్రెటీలు ఇంటి పని చేసుకుంటూ ఉంటే మరి కొందరు వర్కౌట్స్‌ చేస్తున్నారు. అయితే ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ మాత్రం ఆన్‌ లైన్‌ క్లాస్‌ లు వింటోందట.

న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ నుండి ఫిల్మ్‌ మేకింగ్‌ కు సంబంధించిన కోర్సును నిధి నేర్చుకుంటూ ఉందట. ప్రతి రోజు ఆన్‌ లైన్‌ లో క్లాస్‌ లు వింటున్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం కోర్సులో మూడవ సెషన్‌ కొనసాగుతుందని చెప్పింది. స్క్రిప్ట్‌ రైటింగ్‌ ఇంకా దర్శకత్వంకు సంబంధించిన క్లాస్‌ లను వింటున్నట్లుగా చెప్పుకొచ్చింది. టైం వేస్ట్‌ చేయకుండా ఇలా సద్వినియోగం చేసుకుంటూ ఫిల్మ్‌ మేకింగ్‌ పై అవగాహణ పెంచుకోవడం అనేది నిజంగా అధినందనీయం.

తెలుగులో ఈ అమ్మడు సవ్యసాచి.. మిస్టర్‌ మజ్ను చిత్రాలతో పరిచయం అయినా మొదటి సక్సెస్‌ మాత్రం ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో దక్కించుకుంది. పూరి ఈమెకు ఇస్మార్ట్‌ సక్సెస్‌ ఇవ్వడంతో ప్రస్తుతం పలు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు మంచి ప్రాజెక్ట్స్‌ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో ఈమె ఆన్‌ లైన్‌ క్లాస్‌ లు వింటూ ఫిల్మ్‌ మేకింగ్‌ మెలకువలు నేర్చుకుంటోంది. హీరోయిన్‌ గా మంచి భవిష్యత్తు ఈ అమ్మడికి ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచి జోరు మీదున్న సమయంలో ఈ లాక్‌ డౌన్‌ వల్ల నిధి అగర్వాల్‌ నిరుత్సాహంకు గురవుతోంది.