Begin typing your search above and press return to search.

ఆ కొత్త సినిమా కథ ఇదేనా..?

By:  Tupaki Desk   |   4 April 2020 3:30 PM GMT
ఆ కొత్త సినిమా కథ ఇదేనా..?
X
ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు, వాసు వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుస ప్లాపులలో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎలాగైనా హిట్టు కొట్టాల్సిందే అనే కసి తో కన్పిస్తున్నారు హీరో అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్. వరుస పరాజయాలలో ఉండటంతో ఈసారి భాస్కర్ తెచ్చిన కథలో బలముండటంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలుపుతున్నారు. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చిన సమయంలో కరోనా దెబ్బతో షూటింగ్ నిలిపేసి కూర్చుంది చిత్రబృందం.

ఈ సినిమాలో ట్రెండీ బ్యూటీ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని 'మనసా మనసా' పాట విపరీతంగా పాపులర్ అయింది. సిద్ శ్రీరామ్ పాడిన అద్భుతమైన ఈ పాట సినిమా పై హైప్ ని అమాంతంగా పెంచేసింది. అన్నీ కుదిరితే ఈ నెల విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇప్పుడీ సినిమా పై సోషల్ మీడియాలో కొత్త పుకారు హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ఒక యువకుడు తనకు సరిజోడి అయిన అమ్మాయి కోసం వెతుకుతుండగా హీరోయిన్ కంటపడుతుందట. ఇద్దరి మధ్య కొన్ని క్వాలిటీలు కలిసి కలవక హీరో తంటాలు పడతాడట. కథ దీనిచుట్టూ తిరుగుతుందని పుకార్లు లేస్తున్నాయి. మరి అసలు వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.