Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్' ఆ నిర్మాతను బాధిస్తోందా..??

By:  Tupaki Desk   |   26 Jan 2021 4:09 PM GMT
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఆ నిర్మాతను బాధిస్తోందా..??
X
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన టైం నుండి దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటివరకు భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్ లాంటి వీడియో ప్రోమోలను విడుదల చేసినప్పటికి అసలు సినిమా విడుదల ఎప్పుడనేది చర్చగా నిలిచింది.

మొత్తానికి ఇటీవలే ఆర్ఆర్ఆర్ బృందం అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక తేదీ విడుదల చేసింది. ఈ వార్తతో అటు మెగాఫాన్స్, ఇటు నందమూరి ఫాన్స్ లో సందడి అంతాఇంతా కాదు. సినిమా ఇప్పుడు రిలీజ్ చేసినా రికార్డులు బ్రేక్ చేస్తాం అంటున్నారట. అయితే అందరూ ఖుషిగానే ఉన్నారు కానీ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోణికపూర్ మాత్రం హ్యాపీగా లేడని సమాచారం. మరి దేశవ్యాప్తంగా ఆనందం ప్రకటిస్తుంటే బోణికి ఏమైంది అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ లతో పాటు బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అజయ్ దేవగన్ హీరోగా బోణికపూర్ ఓ పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్నాడు. మైదాన్ పేరుతో ఈ సినిమా.. లెజెండరి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. అయితే ఆ సినిమా విడుదల తేదీని గతేడాది లాక్ డౌన్ సమయంలోనే ప్రకటించాడు బోణికపూర్.

2021 అక్టోబర్ 15న మైదాన్ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు తాజాగా ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో బోణి కాస్త నిరాశకు లోనయ్యాడని బాలీవుడ్ వర్గాలలో టాక్. మరి ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ ప్రకటించేముందు రాజమౌళి ఒకసారి తనతో చర్చించాల్సి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారని తెలుస్తుంది. అయితే అప్పటికే అజయ్ దేవగన్ కూడా రాజమౌళికి బోణితో మాట్లాడాలని చెప్పాడట. కానీ ఆర్ఆర్ఆర్ బృందం తనతో మాట్లాడకుండా ఈ నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదని వాపోతున్నాడట. చూడాలి మరి ఈ ఇద్దరిలో దసరా సందడి ఎవరు చేస్తారో..!!