Begin typing your search above and press return to search.

ఆ భామకు తెలుగులో మరో 'ఐటమ్ సాంగ్' అంట..!

By:  Tupaki Desk   |   4 March 2021 10:30 AM GMT
ఆ భామకు తెలుగులో మరో ఐటమ్ సాంగ్ అంట..!
X
'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన లక్ష్మీరాయ్.. సౌత్ లో హీరోయిన్ గా ఎలాంటి గుర్తింపు దక్కించుకోలేకపోయింది. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఐటమ్ సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. 'రాయ్ ల‌క్ష్మీ'గా పేరు మార్చుకొని ఒళ్ళు దాచుకోకుండా క‌ష్ట‌ప‌డి పలు ఐటమ్ సాంగ్స్ లో నర్తించింది. 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమాలో 'తోబ తోబా'.. 'ఖైదీ 150'లో 'రత్తాలు రత్తాలు' వంటి సాంగ్స్ లో స్టెప్పులేసింది. ఈ క్రమంలో బ్యూటీ లుక్స్ బాలీవుడ్ మీద కూడా ప‌డ్డాయి. హిందీలో 'జూలీ 2' సినిమానే కాదు అక్కడ 'పాయిజన్' వంటి కొన్ని కార్పొరేట్ వెబ్ సిరీసుల్లో కూడా న‌టించింది.

అయితే బాలీవుడ్ అంటే మొహం మొత్తిసిందో ఏమో మ‌ళ్లీ ఈ బ్యూటీ తెలుగులో ఉన్న సూప‌ర్ సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లుగా సంకేతాలు ఇస్తోందని తెలుస్తోంది. రాయ్ లక్ష్మీ ప్రస్తుతం 'ఝాన్సీ' అనే కన్నడ మూవీ.. 'సిండ్రెల్లా' అనే తమిళ్ మూవీ.. 'ఆనంద భైరవి' అనే తెలుగు సినిమాలలో నటిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో ఈ భామతో ఓ ఐట‌మ్ సాంగ్ చేయించ‌డానికి పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట. తెలుగు మీద మ‌ళ్లీ మ‌న‌సు పారేసుకుంటున్న ఈ టాల్ బ్యూటీ రాయ్ ల‌క్ష్మీకి ఈసారైనా మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి.