Begin typing your search above and press return to search.

థియేటర్లలోనే కియారా సినిమా..! స్టార్​ హీరోలే భయపడుతున్న వేళ ఇదో సంచలనం

By:  Tupaki Desk   |   25 Nov 2020 7:30 AM GMT
థియేటర్లలోనే కియారా సినిమా..! స్టార్​ హీరోలే భయపడుతున్న వేళ ఇదో సంచలనం
X
కరోనా దెబ్బకు సినిమాలన్నీ ఓటీటీల్లోనే రిలీజ్​ అవుతున్నాయి. లాక్​డౌన్​ తర్వాత చాలాకాలం పాటు థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వాలు లాక్​డౌన్​కు సడలింపులు ఇచ్చాయి. సినిమాలను థియేటర్లలో విడుదల చేసుకొనేందుకు కూడా అనుమతిచ్చాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు రిలీజ్​కు వీలు కల్పించాయి. కానీ జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు థియేటర్లలో సినిమాలు విడుదల చేసేందుకు జంకుతున్నారు. స్టార్​హీరోల సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్​ అవుతున్నాయి. సూర్య నటించిన ‘ఆకాశమే హద్దుగా’ ఓటీటీలో రిలీజ్​ అయి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నది. బాలీవుడ్​ హీరో అక్షయ్​ నటించిన లక్ష్మీబాంబ్​ కూడా ఓటీటీలో విడుదలైంది.

ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమాలు రిలీజ్​ చేసేందుకు భయపడుతున్నారు. కరోనా పూర్తిగా తగ్గిపోయాక విడుదల చేస్తే లాభాలు వస్తాయని ఆశపడుతున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కియారా అద్వానీ నటించిన ‘ఇందూ కి జవానీ’ అనే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామంటూ నిర్మాతలు ప్రకటించారు. డిసెంబర్​ 17న తమ సినిమా థియేటర్ల ముందుకు రాబోతున్నదంటూ ప్రకటన విడుదల చేశారు. పెద్ద పెద్ద హీరోలే థియేటర్లలో సినిమా విడుదలకు భయపడుతున్న వేళ .. హీరోయిన్​ ఓరియెంటెడ్​ మూవీ థియేటర్లలో రిలీజ్​ చేయడం నిజంగా సాహసమే.

అయితే అదే రోజు భూమి పడ్నేకర్​ నటించిన ‘దుర్గామతి’ అనే మరో లేడీ ఒరియంటెడ్​ చిత్రం అమేజాన్​ ప్రైమ్​లో విడుదల కానుంది. తెలుగులో అనుష్క నటించిన భాగమతి చిత్రానికి ఇది రీమేక్​గా వస్తున్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు కేవలం 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉన్నది. ఈ నేపథ్యంలో కియారా సినిమాకు కలెక్షన్లు ఏ మేరకు వస్తాయో వేచి చూడాలి.