Begin typing your search above and press return to search.

మహానటి 'సర్కారు వారి పాట' ఎంతకు పాడిందో...?

By:  Tupaki Desk   |   20 Jun 2020 1:00 PM GMT
మహానటి సర్కారు వారి పాట ఎంతకు పాడిందో...?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తన న్యూ ప్రాజెక్ట్ 'సర్కారు వారి పాట' ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ సినిమా అనుకున్నప్పటి నుండి హీరోయిన్ విషయంలో డైలీ ఏదొక న్యూస్ వస్తూనే ఉంది. 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ కి జోడీగా నటించిన కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'మహర్షి' సినిమాలో నటించిన పూజాహెగ్డే అని.. ఇక బాలీవుడ్ హీరోయిన్ సైఈ మంజ్రేకర్ అని రకరకాల రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలో మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ సూపర్ స్టార్ తో జోడీ కట్టబోతోందని న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంస్టాగ్రామ్ లైవ్లో తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన కీర్తి మహేష్ బాబుతో నటించబోతున్నట్లు స్పష్టం చేసింది.

కాగా 'సర్కారు వారి పాట' స్క్రిప్ట్ కీర్తి సురేష్ కి చెప్పడం.. ఆమె ఓకే అనడం జరిగిపోయాయట. అయితే రెమ్యూనరేషన్ విషయంలో ఇంకా ఒక మాట అనుకోలేదని సమాచారం. నిజానికి 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ రేంజ్ పెరిగిపోయింది. ఒకానొక దశలో స్టార్ హీరోయిన్స్ కి పోటీగా డిమాండ్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పారితోషకాన్ని తగ్గించుకోవాలని కీర్తి సురేష్ నిర్ణయించుకుందట. ఎంత తగ్గించుకున్న కోటి రూపాయల కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే ఛాన్స్ లేదంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి నిర్మాతల్లో ఒకరైన మహేష్ మహానటికి ఎంత మొత్తంలో చెల్లించడానికి రెడీగా ఉన్నాడో తెలియాల్సి ఉంది. అన్ని విషయాలు మాట్లాడుకోవడం అయిపోయాక చిత్ర యూనిట్ హీరోయిన్ గురించి ఆఫీసియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.