Begin typing your search above and press return to search.
'సూపర్ స్టార్'కి నో చెప్పిన యంగ్ హీరోయిన్..
By: Tupaki Desk | 2 May 2020 3:20 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీతో ఓ మాఫియా బ్యాగ్రౌండ్లో ఓ సినిమా హోల్డ్లో పెట్టి విజయ్ దేవరకొండతో సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్తో మహేష్ బాబు ఓకే అన్నారు. ఈ విషయాన్ని పరశురామ్ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ కన్ఫామ్ చేశాడు. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ ఫైనల్గా ఓకే అన్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా అక్టోబర్ నుండి షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట. ఈ సందర్బంగా మహేష్ కోసం అప్పుడే హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. అందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ సరసన భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీని తీసుకోవాలనీ చూశారట. అందులో భాగంగా ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం.
అయితే అమ్మడు ఈ ప్రాజెక్ట్ ని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను అని చెప్పేసిందట. అంతేకాదు మరో రెండేళ్లవరకు తన క్యాలండర్లో ఖాళీ లేదని ఆమె స్పష్టం చేసిందట. కియారా తెలుగులో రామ్ చరణ్తో వినయ విధేయ రామలో కూడా నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం కియారా అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న లక్ష్మీ బాంబ్, ఇందూ కి జవానీ, భూల్ భూలయ్య2లో నటిస్తోంది. అయితే కియారా నో చెప్పడంతో మహేష్ సరసన నటించే మరో అమ్మాయి కోసం వేట మొదలయిందట. అందులో భాగంగా కీర్తి సురేష్ను కూడా చిత్రబృందం పరిశీలిస్తుందట. తాజాగా మరో వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కన్ను గీటి దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ ను కూడా చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి మహేష్ తో రొమాన్స్ చేయనున్న హీరోయిన్ ఎవరో..!
అయితే అమ్మడు ఈ ప్రాజెక్ట్ ని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను అని చెప్పేసిందట. అంతేకాదు మరో రెండేళ్లవరకు తన క్యాలండర్లో ఖాళీ లేదని ఆమె స్పష్టం చేసిందట. కియారా తెలుగులో రామ్ చరణ్తో వినయ విధేయ రామలో కూడా నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం కియారా అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న లక్ష్మీ బాంబ్, ఇందూ కి జవానీ, భూల్ భూలయ్య2లో నటిస్తోంది. అయితే కియారా నో చెప్పడంతో మహేష్ సరసన నటించే మరో అమ్మాయి కోసం వేట మొదలయిందట. అందులో భాగంగా కీర్తి సురేష్ను కూడా చిత్రబృందం పరిశీలిస్తుందట. తాజాగా మరో వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కన్ను గీటి దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ ను కూడా చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి మహేష్ తో రొమాన్స్ చేయనున్న హీరోయిన్ ఎవరో..!
