Begin typing your search above and press return to search.

'మేజర్' మెజారిటీ పార్ట్ షూటింగ్ పూర్తి...!

By:  Tupaki Desk   |   20 Aug 2020 4:00 PM GMT
మేజర్ మెజారిటీ పార్ట్ షూటింగ్ పూర్తి...!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ నటించే సినిమాల్లో భాగస్వామిగా ఉంటూనే ఇతర సినిమా నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు సోనీ పిక్చర్స్ సహకారంతో 'మేజర్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో ప్రజలను కాపాడే క్రమంలో వీరమరణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'మేజర్' చిత్రీకరణకు కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది.

కాగా ఇటీవలే 'మేజర్‌' షూటింగ్‌ ను తిరిగి ప్రారంభించారు. అయితే చిత్రీకరణలో పాల్గొనే యూనిట్‌ లో 54 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 11 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా సోకిన సిబ్బంది ప్లేస్ లో వేరే వారిని తీసుకొని యధావిధిగా షూటింగ్ కొనసాగిస్తున్నారని సమాచారం. సెట్స్ లో మాస్కులు శానిటైజర్స్ తో పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేస్తున్నారని తెలుస్తోంది. శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు.