Begin typing your search above and press return to search.

'గుడికి వచ్చి.. బుద్ధుందా?'.. జర్నలిస్ట్ పై సమంత సీరియస్..!

By:  Tupaki Desk   |   18 Sep 2021 8:30 AM GMT
గుడికి వచ్చి.. బుద్ధుందా?.. జర్నలిస్ట్ పై సమంత సీరియస్..!
X
స్టార్ హీరో సమంత పర్సనల్ లైఫ్ గురించి గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తన భర్త అక్కినేని నాగచైతన్య తో మనస్పర్థలు వచ్చాయని.. ఇది విడాకుల వరకు దారితీసిందని రకరకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అటు చైతన్య కానీ ఇటు సామ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇద్దరూ మీడియాకు దూరంగా ఉండటంతో దీనిపై స్పష్టత రాలేదు. అయితే ఈరోజు శనివారం సమంత మీడియా దృష్టిలో పడటంతో తన వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. సమంత ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న సామ్.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం - తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా సమంత ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె నడుస్తుండగా పలువురు జర్నలిస్టులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్ సమంత విడాకుల గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించమని కోరారు.

సమంత వెంటనే సదరు జర్నలిస్ట్‌ పై కోపగించుకుంటూ.. "గుడికి వచ్చి.. బుద్ధుందా?" అంటూ విరుచుకుపడింది. మరియు దూరంగా వెళ్ళిపోయాడు. జర్నలిస్ట్‌ పై సమంత సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా వీలైనంత త్వరగా స్టార్ కపుల్ తమ వైవాహిక జీవితం పై ఓ స్టేట్మెంట్ ఇచ్చేసి రూమర్స్ కు చెక్ పెట్టాలని.. అప్పటి వరకు గుళ్లో కూడా ఇలాంటివి తప్పదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.