Begin typing your search above and press return to search.

ఈ రాత్రికే ఇనుప సింహాసనం కోసం యుద్దం

By:  Tupaki Desk   |   16 July 2017 8:06 AM GMT
ఈ రాత్రికే ఇనుప సింహాసనం కోసం యుద్దం
X
ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న డేట్ రానే వచ్చింది. అదే జూలై 16. మన టాలీవుడ్లో కూడా చాలామంది సెలబ్రిటీలు ఈ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మన తెలుగులో అయితే బిగ్ బాస్ షో మొదలవుతోంది కాబట్టి ఈ హడావుడి అనుకోవచ్చు కాని.. చాలామంది స్టార్లు ఈ షోకంటే కూడా వేరే ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తున్నారు. అదే గేఫ్‌ ఆఫ్ థ్రోన్స్.ఏకంగా బాహుబలి సినిమాకు సైతం ఎన్నో క్యారక్టర్లను ప్లాట్ లను ఐడియాలనూ అరువిచ్చిన ఈ టివి ప్రోగామ్ 7వ సీజన్ ఈ రోజు రాత్రి HBO ఛానల్ లో మొదలవ్వబోతోంది.

వెస్టెరోస్ రాజ్యంలో కింగ్స్ ల్యాండింగ్ అనే పట్టణంలో.. ఒక ఇనుప సింహాసనం ఉంటుంది. అదే ఐరన్ థ్రోన్. ఎవరైతే అక్కడ కూర్చుని పాలిస్తారో వారే మహా చక్రవర్తి. చుట్టూ ఉన్న నార్త్ రాజ్యాలకూ సౌత్ రాజ్యాలకూ అధిపతులు అవుతారు. ఆల్రెడీ అక్కడి రాజు రాబర్ట్ బెరాథియన్ ను హత్య చేయించి.. ఆ రాజు భార్య సెర్సీ లానిస్టర్ సింహాసనంపై కూర్చుంది. ఇకపోతే హత్యకావించబడిన రాజు.. అంతకంటే ముందు టార్గేరియన్ చక్రవర్తిని వెన్నుపోటు పొడిచాడు. ఆ చక్రవర్తి కూతురు కలేసి ఎలియాస్ డనేరియస్ టార్గేరియన్ కూడా ఆ రాజ్యం కోసమే సైన్యాన్ని కూడగట్టుకుని.. తన దగ్గరున్న మూడు డ్రాగన్లతో కలసి యుద్దాని సన్నద్దమవుతోంది. అలాగే ఉత్తరాన ఉన్న వింటర్ ఫెల్ ను పాలించే రాజు ఎడ్డార్డ్ స్టార్క్ ను కూడా కింగ్స్ ల్యాండింగ్ లో కుట్ర చేసి చంపేయడంతో.. ఆ రాజు పెద్ద కూతురు సాన్సా స్టార్క్.. అలాగే అతని అక్రమ సంతానమైన కొడుకు జాన్ స్నో కూడా కింగ్స్ ల్యాండింగ్ పై దండెత్తాలని రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో వీరు పట్టించుకోనిది ఏంటంటే.. మనుషుల శవాలను తిరిగి బతికించి వారి క్రూర మృగాలుగా మర్చే వైట్ వాకర్స్ కూడా ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచంపై దండెత్తడానికి రెడీ అవుతున్నారు. గత ఆరేళ్ళలో జరిగిన గేమ్‌ ఆఫ్ థ్రోన్స్ కథ ఇదే. ఇప్పుడు 7వ సీజన్లో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అందిరలోనూ ఉంది.

మన టాప్ హీరోలైన మహేష్‌ బాబు తదితరులకు ఈ టివి సిరీస్ అంటే చాలా ప్రాణం. ప్రతే ఏడాదీ మిస్సవ్వకుండా చూస్తుంటారట. ఇప్పుడు కూడా చాలామంది సెలబ్రిటీలు ఈరోజు రాత్రి రాబోతున్న 7వ సీజన్ కోసం కళ్ళలో డ్రాగన్ ఫైర్ దాచుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అది సంగతి. #GameOfThrones