Begin typing your search above and press return to search.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరు సినీ ప్రముఖులకు FSL క్లీన్ చీట్..!
By: Tupaki Desk | 18 Sep 2021 4:30 PM GMTటాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ - హీరో తరుణ్ నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలో తేలింది. పూరీ - తరుణ్ లకు సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ - తల వెంట్రుకలు మరియు గోళ్లను పరీక్షించిన ఫోరెన్సిక్ లేబొరేటరీ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.
2017 జులైలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎక్సైజ్ శాఖ సిట్.. ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు సినీ ప్రముఖుల నమూనాలను సేకరించింది. వారందరూ స్వచ్చందంగానే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపింది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు సమర్పించిందని వెల్లడించారు.
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తాజాగా కెల్విన్ పై నమోదు చేసిన ఛార్జ్ షీట్ తో పాటు ఈ వివరాలను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ కోర్టుకు సమర్పించింది. ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించిందని తెలుస్తోంది. మరో వైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ కు జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని కెల్విన్ ను కోర్టు ఆదేశించింది.
ఇకపోతే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఆగస్ట్ 31న పూరీ జగన్నాథ్ ను ప్రశ్నించడంతో ప్రారంభమైన ఈడీ విచారణ.. ఈ నెల 22న తరుణ్ ని ఎంక్వైరీ చేయడంతో ముగియనుంది. మరో నాలుగు రోజుల్లో తరుణ్ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా.. ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తరుణ్ - పూరీ లకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
2017 జులైలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎక్సైజ్ శాఖ సిట్.. ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు సినీ ప్రముఖుల నమూనాలను సేకరించింది. వారందరూ స్వచ్చందంగానే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపింది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు సమర్పించిందని వెల్లడించారు.
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తాజాగా కెల్విన్ పై నమోదు చేసిన ఛార్జ్ షీట్ తో పాటు ఈ వివరాలను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ కోర్టుకు సమర్పించింది. ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించిందని తెలుస్తోంది. మరో వైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ కు జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని కెల్విన్ ను కోర్టు ఆదేశించింది.
ఇకపోతే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఆగస్ట్ 31న పూరీ జగన్నాథ్ ను ప్రశ్నించడంతో ప్రారంభమైన ఈడీ విచారణ.. ఈ నెల 22న తరుణ్ ని ఎంక్వైరీ చేయడంతో ముగియనుంది. మరో నాలుగు రోజుల్లో తరుణ్ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా.. ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తరుణ్ - పూరీ లకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.