Begin typing your search above and press return to search.

అక్కినేని వారసుడితో 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్స్..?

By:  Tupaki Desk   |   16 Jan 2021 12:31 PM GMT
అక్కినేని వారసుడితో ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్..?
X
'అఖిల్' సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన అక్కినేని అఖిల్.. సాలిడ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' సినిమా చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2 బ్యానర్‌ పై బన్నీ వాస్ - వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. దీని తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయనున్నాడు. అఖిల్ కెరీర్ లో ఐదవ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర - సురేందర్ రెడ్డి కలిసి నిర్మించనున్నారు. ఈ క్రమంలో అఖిల్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ ఓ సినిమా చేయడం సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు - కృష్ణ డీకే బాలీవుడ్ లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. 'డీ ఫర్ దోపిడీ' అనే ప్లాప్ సినిమా తర్వాత టాలీవుడ్ కు దూరమైన ఈ దర్శకద్వయం.. ఇప్పుడు అఖిల్ తో సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ అవడం వెనుక అక్కినేని వారి కోడలు సమంత హస్తం ఉందని తెలుస్తోంది. రాజ్ - డీకే ప్రస్తుతం సామ్ తో 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 వెబ్ సిరీస్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ పరిచయంతో వీరితో తన మరిది కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని సెట్ చేయించిందని టాక్ నడుస్తోంది. దీనిని అశ్వినీ దత్ నిర్మించనున్నాడు. ఇది ఖచ్చితంగా అభిమానులను ఖుషీ చేసే న్యూస్ అనే చెప్పవచ్చు.