Begin typing your search above and press return to search.

దిల్‌ రాజుపై కోడిగుడ్ల ఎటాక్‌

By:  Tupaki Desk   |   25 Jun 2015 1:37 AM GMT
దిల్‌ రాజుపై కోడిగుడ్ల ఎటాక్‌
X
తమ సినిమా హిట్టయ్యి తొలివారంలో 4 కోట్లు కలెక్ట్‌ చేసిందనే ఊపు మీదున్న దిల్‌ రాజు, ''కేరింత'' టీమ్‌తో కలసి ప్రస్తుతం ధియేటర్స్‌ అన్నీ టూర్లు వేస్తున్నారు. ప్రతీ ఊరిలో, ప్రతీ ధియేటర్‌లో వీరికి మంచి రిసెప్షనే లభించింది. కాని శ్రీకాకుళం మాత్రం జనాలు రివర్స్‌ అయ్యారు. ఏకంగా కోడి గుడ్లతో ఎటాక్‌ చేశారు.

కేరింత సినిమా శ్రీకాకుళం నుండి వచ్చి వారి భాష మాట్లాడే పార్వతీశం అనే క్యారెక్టర్‌ ఉంది. ఈ సినిమాలో అతగాడి కామెడీ హైలైట్‌. ఆ యాసలో మనోడు వేసే ప్రాసలు, చేసే కామెంట్లు, అతని అమాయకత్వం ధియేటర్స్‌లో బాగా క్లిక్కయ్యాయ్‌. అయితే ఇదంతా శ్రీకాకుళం జిల్లా విద్యార్ధులను మాత్రం బాగా హర్ట్‌ చేసిందట. అందుకే వారు దిల్‌ రాజు అండ్‌ టీమ్‌ ధియేటర్స్‌కు వచ్చారని తెలుసుకొని అక్కడ వారిని ఎద్దేవా చేశారు. ఎబివిపి కి చెందిన విద్యార్ధులతో కోడిగుడ్లతో ఎటాక్‌ చేశారు. ఇక దిల్‌ రాజు వారికి క్షమాపణ చెప్పేవరకు యునిట్‌ను ముందుకు కదలనిస్తే ఒటు.

ఇది పిచ్చికి పరాకాష్టలా ఉంది.. మొన్నటివరకు మా తెలంగాణ బాషను విలన్స్‌తో మాట్లాడించి మమ్మల్ని అవమానించారని వారు మొరపెట్టారు. ఇప్పుడు సికాకుళం.. అదేనండీ శ్రీకాకుళం జిల్లా బాషను ఇష్టమొచ్చినట్లు వాడుకొని రచ్చ చేస్తున్నారని ఏకంగా కోడి గుడ్లతో దాడి చేసే స్థాయికి వచ్చేసింది. చూస్తుంటే ఇదో సైకోయిజమ్‌లా తయారవుతోంది. ఏదైనా ఉంటే శాంతియుతంగా ఏ ధర్నాయో చేయాలికాని.. ఇలా తిట్టేసి, కొట్టేస్తారా...?? ఆలోచించుకోండి.