Begin typing your search above and press return to search.

కరోనా ప్లాస్మా.. కొరియోగ్రాఫర్ చేసిన పనిపై నటి ప్రశంసలు

By:  Tupaki Desk   |   28 April 2020 11:30 AM GMT
కరోనా ప్లాస్మా.. కొరియోగ్రాఫర్ చేసిన పనిపై నటి ప్రశంసలు
X
బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ తన కజిన్ కూతురు దియా నాయుడుపై ప్రశంసలు కురిపించారు. కరోనాను జయించిన ఆమె ప్రస్తుతం తనలాంటి కరోనా రోగులను కాపాడేందుకు ప్లాస్మా దానం చేయడంపై అభినందించారు. కర్ణాటకలో రెండో ప్లాస్మా ఇచ్చిన వ్యక్తిగా దియా పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నో ప్రాణాలను నిలబెడుతున్న దియా చేసిన పనికి విలువ కట్టలేం అని సీనియర్ నటి నఫీసా అలీ ప్రశంసించారు.

ఇక దియా చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. బెంగళూరులో నివసించే దియా నాయుడు ప్రముఖ కొరియో గ్రాఫర్ గా గుర్తింపు పొందారు. కొన్ని రోజుల క్రితమే కరోనా బారిన పడి ఆమె కోలుకున్నారు.

ఆరోగ్యపరిస్థితి బాగోలేకున్నా ముందుకొచ్చి మరీ ప్లాస్మా ఇచ్చారు దివ్యనాయుడు. కర్ణాటకలో ఇలా ప్లాస్మా ఇచ్చిన రెండో వ్యక్తి ఈమె. కరోనాతో చావుకు దగ్గరైన కరోనా రోగులను వీళ్ల యాంటీబాడీలతో రక్షించవచ్చు. అందుకే తాను ప్రతీ రెండు వారాలకు ప్లాస్మా దానం చేస్తానని దియా తెలిపారు. అందరూ ప్లాస్మా దానం చేయాలని కోరారు. దియా చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.