Begin typing your search above and press return to search.

అక్కడే 50 శాతం కంప్లీట్ చేయాలని చూస్తున్న మహేష్ అండ్ టీమ్...?

By:  Tupaki Desk   |   1 Oct 2020 3:30 AM GMT
అక్కడే 50 శాతం కంప్లీట్ చేయాలని చూస్తున్న మహేష్ అండ్ టీమ్...?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ ఫస్ట్ వీక్ లో అమెరికాలో స్టార్ట్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఇప్పటికే యూఎస్ వెళ్లిన డైరెక్టర్ పరశురామ్ - సినిమాటోగ్రాఫర్ మధి - ఆర్ట్ డైరెక్టర్ ఏయస్ ప్రకాష్ లు లొకేషన్స్ వేటలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం 'సర్కారు వారి పాట' ఫారిన్ షెడ్యూల్ 45 రోజులు ప్లాన్ చేశారట. ఈ సింగిల్ షెడ్యూల్ లో 50 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారట. అక్కడ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు రెండు సాంగ్స్ మరియు సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది.

కాగా, 'సర్కారు వారి పాట'లో మహేష్ క్యారక్టరైజేషన్.. మేనరిజం కూడా కొత్తగా ఉండబోతున్నాయని సమాచారం. గత కొంతకాలంగా మాస్ లుక్ కి దూరంగా ఉన్న మహేష్.. ఈ సినిమాతో ఆ లోటును తీర్చబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మహేష్ ప్రీ లుక్ పోస్టర్ విశేషమైన స్పందన తెచ్చుకుంది. ఫ్రీ హెయిర్ స్టైల్.. చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మహేష్ లుక్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న 'సర్కారు వారి పాట' ను మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. థమన్ సంగీతం సమకూర్చనున్నాడు.