Begin typing your search above and press return to search.

విరాటపర్వంలో ఫస్ట్ హీరో వేరే.. తర్వాతే రానా!

By:  Tupaki Desk   |   8 Jun 2020 5:55 AM GMT
విరాటపర్వంలో ఫస్ట్ హీరో వేరే.. తర్వాతే రానా!
X
టాలీవుడ్ లో 'నీది నాది ఒకే కథ' సినిమాతో మంచి విజయం అందుకున్న యువ దర్శకుడు వేణు ఉడుగుల. తన రెండో సినిమాగా విరాటపర్వం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా చాలా ఆలస్యం అయింది. లేదంటే ఈపాటికి థియేటర్లలో సందడి చేసి ఉండేది. అయితే ఇటీవలే ఈ సినిమా గురించి డైరెక్టర్ వేణు ఊడుగుల కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. "నిజానికి ఈ సినిమా కథ రాసుకునే టైంలో నా మైండ్ లో హీరోగా కేవలం తమిళ హీరో కార్తీనే ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత స్క్రిప్ట్ డెవలప్ చేసేటప్పుడు కార్తీ కేవలం తమిళంలోనే ఎక్కువ మార్కెట్ కలిగి ఉన్నాడు. కార్తీకి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. ఆ విషయం దృష్టిలో ఉంచుకొని రీజినల్ హీరో అయితే బాగుంటుందని మళ్లీ హీరో రానాను ఫిక్స్ అయ్యాను.

ఇక వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్లి రానాకి కథ చెప్తే వెంటనే ఓకే చేసి డేట్స్ ఇచ్చేసాడు. ఇక అలాగే నేను ఈ సినిమాలో ఫస్ట్ నుండి కూడా హీరోయిన్గా సాయిపల్లవినే అనుకున్నాను. వెళ్లి స్క్రిప్ట్ వినిపించగానే ఓకే చెప్పింది. నిజానికి సాయిపల్లవి నా మొదటి సినిమాలోనే చేయాల్సింది కానీ ఆ టైంలో ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు. కానీ ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ ఇరగదీసింది. 1990ల నాటి నక్సలైట్ల జీవితాల ఆధారంగా పీరియాడిక్ సోషల్ మూవీగా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో ఫేమస్ యాక్టర్ నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరి రావు, జరీనా వాహిబ్.. ఇతర ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 90శాతం ముగిసిందని డైరెక్టర్ తెలిపాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.