Begin typing your search above and press return to search.
శర్వానంద్ కి ఎసరు పెట్టబోతున్నారా?
By: Tupaki Desk | 2 Dec 2016 5:30 PM GMTవిడుదల విషయంలో ప్లానింగులు ఎక్కడైనా వర్కవుట్ అవుతాయేమో కానీ... తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం చాలా కష్టం. చిన్న సినిమాలైతే అవి ఎప్పుడొస్తాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఒక్క స్టార్ సినిమా కాస్త అటు ఇటూ అయితే చాలు... అది ఇది అని లేకుండా అన్ని సినిమాల రిలీజ్ డేట్లూ మారిపోతుంటాయి. `సింగం 3` విడుదల తేదీ వాయిదా పడటంతో ఆ విషయం మరోసారి ఇండస్ట్రీకి బాగా తెలిసొచ్చింది. డిసెంబరు 16న రావల్సిన సూర్య `సింగం3` చరణ్ `ధృవ` కోసమని 23కి మారిపోయింది. దాంతో 23న రావాలనుకొన్న సినిమాలు కొన్ని ముందుకు వచ్చేశాయి. కొన్ని సినిమాలు మాత్రం వాయిదా వేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నాయి. నిజానికి క్రిస్ మస్ కి నాని సినిమా `నేను లోకల్` విడుదల కావల్సి ఉంది. అయితే సూర్యలాంటి స్టార్ కథానాయకుడి సినిమాతో పాటుగా `నేను లోకల్` విడుదల చేయడం దిల్ రాజుకి ఇష్టం లేదట. దాంతో `నేను లోకల్`ని వాయిదా వేయబోతున్నట్టు తెలిసింది. అయితే ఉరుమొచ్చి మంగళం మీద పడ్డట్టుగా నాని సినిమా కాస్త శర్వానంద్ `శతమానం భవతి`కి ఎసరు పెట్టే అవకాశాలున్నాయని తెలిసింది.
దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కిన శతమానం భవతి సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనేది మాట. ఆ మేరకు ఇటీవల షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. అయితే క్రిస్ మస్ కి రావల్సిన నాని `నేను లోకల్`ని సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుందా అని ఇప్పుడు దిల్ రాజు ఆలోచిస్తున్నాడట. నానికి మాస్ ప్రేక్షకుల్లో మంచి పట్టుంది. ఆయన సినిమా సంక్రాంతికి విడుదలైందంటే పెద్దయెత్తున ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే శతమానం భవతిని ఫిబ్రవరికి వాయిదా వేసి నాని సినిమాని సంక్రాంతికి తీసుకొచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్నగర్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రం శతమానం భవతి సంక్రాంతికే రావల్సిన సినిమా అనీ, అది ఫక్తు ఫ్యామిలీ సబ్జెక్టుతో తెరకెక్కిన సినిమా కాబట్టి దాన్ని దిల్రాజు ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయడని మాట్లాడుకొంటున్నారు. పైగా శర్వానంద్ సినిమాలకి కూడా ఈమధ్య మంచి ఓపెనింగ్సే వస్తున్నాయి కాబట్టి శతమానం భవతిని వాయిదా వేయకపోవచ్చన్న వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. మరి దిల్రాజు నిర్ణయమేంటన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కిన శతమానం భవతి సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనేది మాట. ఆ మేరకు ఇటీవల షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. అయితే క్రిస్ మస్ కి రావల్సిన నాని `నేను లోకల్`ని సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుందా అని ఇప్పుడు దిల్ రాజు ఆలోచిస్తున్నాడట. నానికి మాస్ ప్రేక్షకుల్లో మంచి పట్టుంది. ఆయన సినిమా సంక్రాంతికి విడుదలైందంటే పెద్దయెత్తున ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే శతమానం భవతిని ఫిబ్రవరికి వాయిదా వేసి నాని సినిమాని సంక్రాంతికి తీసుకొచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్నగర్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రం శతమానం భవతి సంక్రాంతికే రావల్సిన సినిమా అనీ, అది ఫక్తు ఫ్యామిలీ సబ్జెక్టుతో తెరకెక్కిన సినిమా కాబట్టి దాన్ని దిల్రాజు ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయడని మాట్లాడుకొంటున్నారు. పైగా శర్వానంద్ సినిమాలకి కూడా ఈమధ్య మంచి ఓపెనింగ్సే వస్తున్నాయి కాబట్టి శతమానం భవతిని వాయిదా వేయకపోవచ్చన్న వాదనలూ బలంగా వినిపిస్తున్నాయి. మరి దిల్రాజు నిర్ణయమేంటన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/