Begin typing your search above and press return to search.
‘ఢిల్లీ క్రైమ్’ వెబ్ సిరీస్ కు అరుదైన గౌరవం..!
By: Tupaki Desk | 27 Nov 2020 9:00 AM ISTప్రస్తుతం వెబ్సీరీస్ల యుగం నడుస్తున్నది. లాక్డౌన్తో థియేటర్లు మూతపడటంతో వెబ్సీరీస్లకు కాలం కలిసివచ్చింది. ఇక్కడ సెన్సార్ పరమైన ఇబ్బందులు లేకపోవడంతో దర్శకులు తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు. ఈ లాక్డౌన్ పీరియడ్లో అన్ని భాషల్లోనూ వెబ్సీరిస్లు వచ్చాయి. ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్నాయి. అయితే కొన్ని వెబ్సీరిస్ల్లో శ్రుతిమించిన శృంగారం, బూతు పదాలు వాడారన్న విమర్శలు ఉన్నాయి. కేవలం యూత్ను దృష్టిలో ఉంచుకొని దర్శకులు ఈ తరహా కథలను రూపొందిస్తున్నారు.
చాలామంది యువ దర్శకులకు ఈ వెబ్సీరిస్లు ఒక వేదికగా కూడా ఉన్నాయి. కొన్ని వెబ్సీరిస్లపై హిందూసంఘాలు, సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా వెబ్సీరీస్లు కొత్త నటీనటులను, దర్శకులను, కథరచయితలను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. థియేటర్లు లేని లోటును కొంతవరకు తీర్చాయి. అయితే నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిచీ మెహతా తెరకెక్కించిన ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్ సీరిస్కు అంతర్జాతీయ పురస్కారం దక్కింది.48 వ ఇంటర్నేషన్ అవార్డుల్లో నెట్ ఫ్లిక్స్లో ప్రసారమైన ‘ఢిల్లీ క్రైమ్’కు బెస్ట్ డ్రామా సీరిస్ అవార్డు వచ్చింది. ఈ అవార్డును దేశంలోని మహిళంలదరికీ అంకితం ఇస్తున్నట్టు డైరెక్టర్ రిచీ మెహతా ప్రకటించారు.
షెఫాలీ షా ఈ సినిమాలో పోలీస్ఆఫీసర్గా నటించారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆమె సోషల్మీడియాలో వెబ్సీరిస్లోని ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేశారు. ఈ వెబ్సీరిస్లో షెఫాలీ షా, రసికా దుగ్గల్, అదిల్ హుస్సైన్, రాజేశ్ తైలాంగ్ ముఖ్యపాత్రలు పోషించగా.. 2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్, మర్డర్ కేస్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో నలుగురు దుర్మార్గులు బస్సులో వెళుతున్న ఫిజియోథెరపీ విద్యార్థిని దారుణంగా రేప్చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిర్భయ కథ ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు.
చాలామంది యువ దర్శకులకు ఈ వెబ్సీరిస్లు ఒక వేదికగా కూడా ఉన్నాయి. కొన్ని వెబ్సీరిస్లపై హిందూసంఘాలు, సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా వెబ్సీరీస్లు కొత్త నటీనటులను, దర్శకులను, కథరచయితలను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. థియేటర్లు లేని లోటును కొంతవరకు తీర్చాయి. అయితే నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిచీ మెహతా తెరకెక్కించిన ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్ సీరిస్కు అంతర్జాతీయ పురస్కారం దక్కింది.48 వ ఇంటర్నేషన్ అవార్డుల్లో నెట్ ఫ్లిక్స్లో ప్రసారమైన ‘ఢిల్లీ క్రైమ్’కు బెస్ట్ డ్రామా సీరిస్ అవార్డు వచ్చింది. ఈ అవార్డును దేశంలోని మహిళంలదరికీ అంకితం ఇస్తున్నట్టు డైరెక్టర్ రిచీ మెహతా ప్రకటించారు.
షెఫాలీ షా ఈ సినిమాలో పోలీస్ఆఫీసర్గా నటించారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆమె సోషల్మీడియాలో వెబ్సీరిస్లోని ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేశారు. ఈ వెబ్సీరిస్లో షెఫాలీ షా, రసికా దుగ్గల్, అదిల్ హుస్సైన్, రాజేశ్ తైలాంగ్ ముఖ్యపాత్రలు పోషించగా.. 2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్, మర్డర్ కేస్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో నలుగురు దుర్మార్గులు బస్సులో వెళుతున్న ఫిజియోథెరపీ విద్యార్థిని దారుణంగా రేప్చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిర్భయ కథ ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు.
