Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ కు జోడీగా క్రేజీ బ్యూటీలు సైసై

By:  Tupaki Desk   |   6 Feb 2020 1:30 PM GMT
పవర్ స్టార్ కు జోడీగా క్రేజీ బ్యూటీలు సైసై
X
హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అందుకే బడా నిర్మాతలు సైతం ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అవుతారు భారీ పారితోషికం ముట్టజెప్పి మారీ పవన్ తో సినిమాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ తన రీ-ఎంట్రీలో ఇప్పటి వరకూ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' రీమేక్ షూటింగ్ మొదట ప్రారంభమైంది. తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా లాంచ్ అయింది. షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాలు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా ప్రకటన వచ్చింది.

ఈ సినిమాల్లో హీరోయిన్లు ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పింక్ రీమేక్ లో హీరోయిన్ ప్రాధాన్యత ఏమీ ఉండదనే సంగతి తెలిసిందే. సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాలో నిజానికి హీరోయిజం కూడా ఏమీ ఉండదు. హీరోయిన్ పాత్ర అసలు అవసరమే లేదు. అయితే పవన్ ఇమేజ్ కి తగ్గట్టు మారుస్తున్నారు కాబట్టి ఏదో ఉండాలి కాబట్టి ఒక హీరోయిన్ ను పెడతారేమో చూడాలి.

ఇక క్రిష్ సినిమా.. హరీష్ శంకర్ సినిమాలకు మాత్రం క్రేజీ హీరోయిన్ల ను ఇప్పటికీ లాక్ చేశారని సమాచారం. క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియడ్ ఫిలిం లో పవన్ కళ్యాణ్ కు జోడీగా కియారా అద్వానిని హీరోయిన్ గా ఎంచుకున్నారట. మరోవైపు హరీష్ శంకర్ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా లాక్ చేసినట్టు సమాచారం. ఇద్దరూ బ్యూటీలు పవన్ సినిమా ఆఫర్లు స్వీకరించారని.. పవర్ స్టార్ తో నటించేందుకు తెగ ఆసక్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. 'ఎంతైనా పవర్ స్టార్ పవర్ స్టారే.. అయన స్టార్ పవర్ స్టార్ పవరే'.. అరె సాంబ డైలాగ్ బాగుంది రాసుకో అని చెప్పాలేమో.