Begin typing your search above and press return to search.

కరోనా దెబ్బకు బలవుతున్న సినిమా..

By:  Tupaki Desk   |   16 March 2020 1:30 PM GMT
కరోనా దెబ్బకు బలవుతున్న సినిమా..
X
కరోనా ఎఫెక్ట్ జనాలపైనే కాదు. సినిమాలపై కూడా ఉంది. కరోనా దెబ్బతో తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్, కాలేజీలతో పాటు సినిమా థియేటర్లను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా ప్రభావంతో సినిమాలకు షికార్లకే కాదు కదా.. కనీసం ఇంట్లో నుండి బయటికి రావడానికి కూడా జనాలు వణికి పోతున్నారు. ఆ ఎఫెక్ట్ తో ఒకే ఒక సినిమా చిక్కులో పడింది. ఎలాంటి ఎక్సపెక్టేషన్లు లేకుండా రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంటున్న సినిమా మధ.

శ్రీవిద్య బసవ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైంది. తక్కువ బడ్జెట్ లో సైకోలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతవారం విడుదలైంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా లిమిటెడ్ థియేటర్లలో విడుదల అవడంతో జనాలకు పెద్దగా ఈ సినిమా గురించి తెలియలేదు. కానీ మంచి టాక్ తో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడంతో పెద్ద దెబ్బ పడింది.

మొదటి రోజు కంటే రెండో రోజు నుండి కలెక్షన్స్ పెరుగుతాయని అనుకునే లోపే కరోనా బారిన పడి కనుమరుగు అవుతుంది. వారం తర్వాత థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరని అభిప్రాయపడుతున్నారు. ఇదేగాక ఏపీ లో కూడా త్వరలో థియేటర్లు మూసివేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అదే గనుక జరిగితే మధ సినిమా కథ అర్ధాంతరంగా ముగిసి పోతుంది. చూడాలి మరి ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటున్న మధకు ఎలాంటి న్యాయం జరుగుతుందో..!