Begin typing your search above and press return to search.
ప్రభాస్ మైండ్ సెట్ పై మహమ్మారీ ఆపరేషన్..!
By: Tupaki Desk | 30 Sept 2020 10:30 AM ISTరామోజీ ఫిల్మ్ సిటీలో సెట్లు నిర్మించి షూటింగులు చేస్తే వచ్చే బిల్లులపై చాలా కాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకుముందు బాహుబలి చిత్రాన్ని రాజమౌళి రామోజీ ఫిలింసిటీలోనే నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిల్లుల విషయంలో భేధాభిప్రాయాలొచ్చాయంటూ ప్రచారం సాగింది. అది గతం అనుకుంటే వర్తమానంలో `రాధేశ్యామ్` టీమ్ అందుకు ఆస్కారం ఇవ్వడం లేదట.
ఆర్.ఎఫ్.సి కంటే బంజరు భూములను అద్దెకు తీసుకోవడం కరెక్ట్ అని భావిస్తున్నారట. రామోజీ రావు సాధారణంగా ఖాళీ భూములు ఇవ్వడానికి కూడా అధిక అద్దెలు వసూలు చేస్తారు. దీంతో `రాధేశ్యామ్` టీమ్ ఒక ప్రణాళికతో ముందుకు వచ్చారు. కానీ అదే వారికి ఇప్పుడు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. సెట్ల కోసం భారీగా రెంట్ పే చేయాల్సి వస్తోందిట.
తెల్లాపూర్ ప్రాంతానికి సమీపంలో దాదాపు 4 ఎకరాల భూమిని భారీ సెట్ల కోసం లీజుకు తీసుకున్నారు. సినిమా కోసం అక్కడ భారీ స్థాయిలో కొన్ని సెట్లను నిర్మించారు. యూరోపియన్ టౌన్ స్కేప్ .. పాతకాలపు రైల్వే స్టేషన్ సహా నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే వస్తువులను రూపొందించారు. గత 7 నెలల నుండి ఎటువంటి షూటింగ్ లు జరగకపోవడంతో ఈ సెట్ లో చాలా వరకు ప్రాపర్టీస్ పాడైపోయాయట. అంతే కాకుండా సెట్ లు కూడా పూర్తిగా ధ్వంశం అయినట్టు తెలుస్తోంది. తిరిగి షూటింగ్ చేయాలంటే మళ్లీ కొత్తగా సెట్ లు వేయాల్సిందేనట.
అయితే ఈ సెట్లలో కాకుండా ఇటలీలోని రియల్ లొకేషన్లలో షూట్ చేయడానికి ప్రభాస్ ఆసక్తి చూపడంతో ఇప్పుడు సెట్ల అద్దెలు ఇతర ఖర్చులు వృధా అవుతున్నాయి. వాస్తవానికి యూవీ సంస్థ కోవిడ్ -19 వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇటలీ వెళ్లడానికి వీలు లేకపోవడంతో ఈ సెట్లను నిర్మించారు. వాటిని అలాగే వుంచినా డిమోలిష్ చేసినా నిర్మాతలకు భారీగా ఖర్చు ఖాయం అని తెలుస్తోంది. అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరగడంతో ప్రభాస్ దీనికి పరిష్కారం కోసం ఎదురుచూస్తుండగా `రాధేశ్యామ్` బృందం ఇటలీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా.. తాజా లాస్ నేపథ్యంలో ప్రభాస్ ఒత్తిడికి గురవుతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి.
ఆర్.ఎఫ్.సి కంటే బంజరు భూములను అద్దెకు తీసుకోవడం కరెక్ట్ అని భావిస్తున్నారట. రామోజీ రావు సాధారణంగా ఖాళీ భూములు ఇవ్వడానికి కూడా అధిక అద్దెలు వసూలు చేస్తారు. దీంతో `రాధేశ్యామ్` టీమ్ ఒక ప్రణాళికతో ముందుకు వచ్చారు. కానీ అదే వారికి ఇప్పుడు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. సెట్ల కోసం భారీగా రెంట్ పే చేయాల్సి వస్తోందిట.
తెల్లాపూర్ ప్రాంతానికి సమీపంలో దాదాపు 4 ఎకరాల భూమిని భారీ సెట్ల కోసం లీజుకు తీసుకున్నారు. సినిమా కోసం అక్కడ భారీ స్థాయిలో కొన్ని సెట్లను నిర్మించారు. యూరోపియన్ టౌన్ స్కేప్ .. పాతకాలపు రైల్వే స్టేషన్ సహా నాటి వాతావరణాన్ని ప్రతిబింబించే వస్తువులను రూపొందించారు. గత 7 నెలల నుండి ఎటువంటి షూటింగ్ లు జరగకపోవడంతో ఈ సెట్ లో చాలా వరకు ప్రాపర్టీస్ పాడైపోయాయట. అంతే కాకుండా సెట్ లు కూడా పూర్తిగా ధ్వంశం అయినట్టు తెలుస్తోంది. తిరిగి షూటింగ్ చేయాలంటే మళ్లీ కొత్తగా సెట్ లు వేయాల్సిందేనట.
అయితే ఈ సెట్లలో కాకుండా ఇటలీలోని రియల్ లొకేషన్లలో షూట్ చేయడానికి ప్రభాస్ ఆసక్తి చూపడంతో ఇప్పుడు సెట్ల అద్దెలు ఇతర ఖర్చులు వృధా అవుతున్నాయి. వాస్తవానికి యూవీ సంస్థ కోవిడ్ -19 వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇటలీ వెళ్లడానికి వీలు లేకపోవడంతో ఈ సెట్లను నిర్మించారు. వాటిని అలాగే వుంచినా డిమోలిష్ చేసినా నిర్మాతలకు భారీగా ఖర్చు ఖాయం అని తెలుస్తోంది. అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరగడంతో ప్రభాస్ దీనికి పరిష్కారం కోసం ఎదురుచూస్తుండగా `రాధేశ్యామ్` బృందం ఇటలీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా.. తాజా లాస్ నేపథ్యంలో ప్రభాస్ ఒత్తిడికి గురవుతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి.
