Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మూవీ పై క్లారిటీ కావాలి: ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   17 May 2021 11:30 AM GMT
ఎన్టీఆర్ మూవీ పై క్లారిటీ కావాలి: ఫ్యాన్స్
X
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్డం అందుకోనున్నాడు. మరి అసలే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అంటే.. ఇకపై రాబోయే సినిమాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇకపై ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఫేవరేట్ హీరో బర్త్ డే సందర్బంగా నందమరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ మూవీస్ నుండి అప్డేట్స్ కోరుతున్నారు. అందులోను ఎక్కువ రోజుల సమయం లేకపోవడంతో మేకర్స్ పై ఫ్యాన్స్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికే ఎన్టీఆర్ 30వ సినిమా స్టార్ డైరెక్టర్ కొరటాలశివతో అని అధికారికంగా తెలిసిపోయింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరో స్పెషల్ అనౌన్స్ మెంట్ కూడా ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

రాజమౌళి - కొరటాలతో పాటు ఎన్టీఆర్ తదుపరి మైత్రి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నాడు. మరి ఆ సినిమా డైరెక్టర్ ఎవరినేది ఇంకా తెలియలేదు. ఆ విషయం పై మైత్రి వారు క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ - కొరటాల నుండి మే 20న పోస్టర్స్ రిలీజ్ కాబోతున్నాయి. మరి ఓవైపు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ - మైత్రి కాంబినేషన్ పై ఇదివరకు ఓ సినిమా రాబోతున్నట్లు వార్తలు హల్చల్ చేసాయి. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు మైత్రి మూవీస్ తోనే మరో సినిమా ఉండబోతుందని.. అదికూడా ఓ స్టార్ హీరోతో అని చెప్పాడు. మరి ఎన్టీఆర్ తదుపరి సినిమాకు ఎవరు డైరెక్టర్ అనేది బర్త్ డే చెబుతారా లేదా చూడాలి.