Begin typing your search above and press return to search.

5కోట్లు ఖ‌ర్చు.. 15కోట్లు లాభం?

By:  Tupaki Desk   |   7 Sep 2015 5:17 AM GMT
5కోట్లు ఖ‌ర్చు.. 15కోట్లు లాభం?
X
రాజ్‌ త‌రుణ్‌-అవికా గోర్ జంట‌గా త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా చూపిస్త మావ ఈ ఏడాది రిలీజైన చిన్న సినిమాల్లో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌. 5 కోట్ల ఖ‌ర్చుతో తెర‌కెక్కి 15కోట్లు వ‌సూలు చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా ఆన్‌ సెట్స్ వెళ్ల‌డం వెన‌క సినిమా క‌థంత హిస్ట‌రీ ఉంది. ఈ సినిమాకి నిర్మాత ఓ ఎన్నారై. పేరు ఎన్‌.రాజ‌శేఖ‌ర్‌. ఆయ‌న అమెరికాలో పెద్ద బిజినెస్ మేన్‌. రెస్టారెంట్‌, ఐటీ బిజినెస్ లో తెలుగోడి కీర్తిని విదేశాల‌లో విస్త‌రిస్తున్న స‌క్సెస్‌ ఫుల్ వ్యాపార‌వేత్త‌. అయితే సినిమా అంటే ఉన్న పిచ్చితో ఎలా అయినా తెలుగులో ఓ సినిమా చేయాల‌ని త‌పించాడు.

అలా ముందుగా అవికాగోర్‌ ని క‌లిసి కాల్షీట్లు తీసుకున్నాడు. అవికాగోర్‌ తో ఓ సినిమా ప్రారంభించాడు. కానీ అది ఎందుక‌నో వ‌ర్క‌వుట‌వ్వ‌లేదు. ఆ టైమ్‌ లోనే అవిక డేట్స్ చిక్కాయి కాబ‌ట్టి ఏదో ఒక సినిమా తీయాల‌ని అనుకున్నాడు. అలా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చూపిస్త మావ సెట్స్‌ కెళ్లింది. 8నెల‌ల్లో సినిమా పూర్తి చేశారు. రిలీజ‌య్యాక సూప‌ర్‌ హిట్ టాక్ వ‌చ్చింది. ఒక్క సినిమాతోనే ఎన్నారై సినిమా చూపించాడు. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో, స‌రైన అభిరుచితో సినిమా తీసి చూపిస్తే తెలుగు ప్రేక్ష‌కుల మెప్పు పొంద‌డం క‌ష్టం కాద‌ని ఈ సినిమా నిరూపించింది.

ఇటీవ‌లి కాలంలో ఎన్నారైల హ‌వా టాలీవుడ్‌ లో మ‌రింత పెరిగింది. ఒక్క సినిమాతోనే కోట్లాది రూపాయ‌ల లాభాల్ని ఆర్జిస్తున్నారు. లైఫ్‌ టైమ్ మిలియ‌నీర్ లుగా ఎదిగేస్తున్నారు. కేవ‌లం 5కోట్ల ఖ‌ర్చుతో సినిమా చూపిస్త మావ తీసి ఇప్పుడు 10కోట్ల లాభాల్ని ఖాతాలో వేసుకున్నాడు ఎన్‌.రాజ‌శేఖ‌ర్‌. ఒక డాక్ట‌ర్ జీవితాంతం క‌ష్టిస్తే సంపాదించేది ఈయ‌న ఒక్క సినిమాతోనే సంపాదించేశాడుగా..