Begin typing your search above and press return to search.

ఆరు ఫ్లాపులైనా తగ్గని తేజు సినిమా బిజినెస్

By:  Tupaki Desk   |   7 March 2019 7:09 AM GMT
ఆరు ఫ్లాపులైనా తగ్గని తేజు సినిమా బిజినెస్
X
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్- దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'చిత్రలహరి'. కళ్యాణి ప్రియదర్శన్.. నివేద పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకోవడంతో సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిందట. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అందరికీ షాక్ ఇచ్చే రేంజ్ లో జరుగుతోందట.

తేజు నటించిన ఆరు సినిమాలు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో తేజు మార్కెట్ డౌన్ అయిందని చాలామంది అనుకున్నారు. మరోవైపు దర్శకుడు కిషోర్ తిరుమల లాస్ట్ సినిమా 'ఉన్నదీ ఒకటే జిందగీ' కూడా ఫ్లాపే. దీంతో 10 కోట్ల రూపాయల బిజినెస్ జరగడమే కష్టమని అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలోనే 15 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని సమాచారం. నైజామ్ లో దిల్ రాజు.. ఉత్తరాంధ్ర గాయత్రీ దేవీ ఫిలిమ్స్.. కృష్ణ లో క్రేజీ మూవీ మేకర్స్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నారు. సినిమాపై నెలకొన్న పాజిటివ్ బజ్.. మైత్రీ బ్యానర్ ఇమేజ్ తోడవడంతో తేజు సినిమా కు మంచి రేటు పలికిందని అంటున్నారు.

దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఏప్రిల్ లోన్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా విజయం తేజు.. కిషోర్ తిరుమల.. మైత్రీ బ్యానర్.. అందరికీ కీలకం కానుంది. మరి అందరినీ కలిపి ఒకేసారి హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.