Begin typing your search above and press return to search.

ఇచ్చిన మాట కోసం ప్రత్యేక విమానంలో చిరు..!

By:  Tupaki Desk   |   7 May 2019 6:46 AM GMT
ఇచ్చిన మాట కోసం ప్రత్యేక విమానంలో చిరు..!
X
మెగాస్టార్‌ చిరంజీవి డైరెక్టర్స్‌ డే సందర్బంగా మరోసారి తన ఔనత్యంను చాటుకున్నాడు. పాతిక లక్షల విరాళంను డైరెక్టర్స్‌ అసోషియేషన్‌ కు విరాళంగా అందించిన విషయం తెల్సిందే. దాసరి జయంతి సందర్బంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో చిరు ఆరోజు పాల్గొన్నారు. డైరెక్టర్స్‌ డే సందర్బంగా భారీ విరాళం ఇవ్వడంతో పాటు చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి బెంగళూరు నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ కు రావడం చర్చనీయాంశం అవుతోంది.

దర్శకుల సంఘం నిర్వహించబోతున్న వేడుకలో చిరంజీవి పాల్గొనేందుకు కొన్ని వారాల ముందే హామీ ఇచ్చాడు. ఆ సమయంకు చిరంజీవి హైదరాబాద్‌ లోనే ఉండాల్సి ఉంది. అయితే సైరా చిత్రం సెట్స్‌ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో షూటింగ్‌ కు బ్రేక్‌ ఇచ్చారు. దాంతో చిరంజీవి బెంగళూరుకు ఫ్యామిలీతో పాటు వెళ్లి హాలీడేస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ముందే ఇచ్చిన కమిట్‌ మెంట్‌ కోసం అని చిరంజీవి డైరెక్టర్స్‌ డే రోజు ప్రత్యేకంగా విమానంను బుక్‌ చేసుకుని మరీ హైదరాబాద్‌ వచ్చారు.

చాలా ఖర్చు పెట్టుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వచ్చి కార్యక్రమంలో పాల్గొని, ఆ తర్వాత మళ్లీ తిరిగి అదే విమానంలో బెంగళూరుకు తిరిగి వెళ్లినట్లుగా తెలుస్తోంది. తాను ఇచ్చిన కమిట్‌ మెంట్‌ కోసం ఖర్చుకు వెనుకాడకుండా చార్టెడ్‌ ఫ్లైట్‌ లో లచిరంజీవి రావడం ఆయన గొప్పదనంగా చెబుతున్నారు. చిరంజీవి మంచి గుణంకు ఇది మరో నిదర్శణంగా చెప్పుకోవచ్చు. చిరంజీవి హాజరు కాకున్నా ఆయన్ను అనే వారు ఎవరు లేరు. కాని ఆయన ఇచ్చిన మాట కోసం ప్రత్యేక విమానంలో రావడం ఆయన గొప్పదనం అంటూ దర్శకుల సంఘం సభ్యులు ప్రశంసిస్తున్నారు.