Begin typing your search above and press return to search.

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ - సీసీసీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్..!

By:  Tupaki Desk   |   7 Jun 2021 6:00 PM IST
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ - సీసీసీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్..!
X
కరోనా విపత్కర పరిస్థితుల్లో సినీ కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ) వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ ల సినీ వర్కర్స్ - అలాగే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ సభ్యులు - ఫిల్మ్ జర్నలిస్ట్ ల కుటుంబాలకు వ్యాక్సిన్‌ వేయించడానికి సీసీసీ పూనుకుంది. అపోలో హాస్పిటల్ సహకారంతో ఇప్పటికే 45ఏళ్లు పైబడిన వారికి మొదటి డోస్‌ వేయించారు. ఈ క్రమంలో ఈరోజు సోమవారం 18ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేయించే కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రోగ్రామ్ లో చిరంజీవి తోపాటుగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ - దర్శకుడు ఎన్‌.శంకర్‌ పాల్గొన్నారు.

అపోలో హాస్పిటల్ సహకారంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మరియు కరోనా క్రైసిస్‌ ఛారిటీ కలసి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ చేపట్టినట్లు చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ''కరోనా క్రైసిస్ ఛారిటీ కింద ఈరోజు సినిమా 24 క్రాఫ్ట్స్ వర్కర్స్ - ఫిలిం ఫెడరేషన్ వారితో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్నీ ఇందులో చేర్చడం జరిగింది. అలాగే జర్నలిస్ట్ లకు కూడా వాక్సిన్ ఇస్తున్నాం. సీసీసీ తలపెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు - అపోలో 24/7 సహకారంతో ఈ వాక్సిన్ డ్రైవ్ పునఃప్రారంభం అయింది'' అని తెలిపారు.

''ఇప్పటికే వేలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రోజుకు కనీసం ఐదారు వందల మందికి వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా సినీ కార్మికులందరూ వాక్సిన్ తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో సినిమా కార్మికులు అందరూ పాల్గొనేలా మోటివేట్ చేసిన భరద్వాజ గారికి, శంకర్ కు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారికి, సెక్రెటరీ దొరై గార్లకు అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ సందర్బంగా అపోలో వారికీ నా అభినందనలు తెలుపుతున్నాను"

''గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో సీసీసీ ఆధ్వర్యంలో ఫండ్స్ కలెక్ట్ చేసి సినిమా కార్మికులకు మూడుసార్లు నిత్యావసర సరుకులు అందచేశాం. ఇప్పుడు సినీ కార్మికులందరిని ఒకే వేదికపైకి తెచ్చి సీసీసీ ఆధ్వర్యంలో వాక్సిన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నాం. సీసీసీ కోసం అందరు ముందుకొచ్చి డొనేషన్స్ ఇచ్చారు. అందులో ప్రతి ఒక్క పైసా కూడా అవసరం ఉన్నవాళ్లకు చేరేలా చర్యలు తీసుకుంటామని నేను భరోసా ఇస్తున్నాను. 18 ఏళ్ళు నిండిన వారందరూ తప్పకుండా వాక్సిన్ తీసుకోవాలి. అందరం వాక్సిన్ తీసుకుని కరోనా నుంచి కాపాడుకుందాం'' అని చిరంజీవి అన్నారు.