Begin typing your search above and press return to search.

నిధానంగా బాలీవుడ్‌లో పాపులరైంది

By:  Tupaki Desk   |   12 July 2015 12:33 AM GMT
నిధానంగా బాలీవుడ్‌లో పాపులరైంది
X
సింగర్‌ కం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చెన్నయ్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మడికి హైదరాబాద్‌తో గొప్ప అనుబంధం ఉంది. తెలుగు సినిమాతో చాలా కాలంగా అనుబంధం కొనసాగిస్తోంది. ఇక్కడే ఎక్కువ కాలం గడిపేసింది. హీరో రాహుల్‌ రవిచంద్రన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ గాయనిగా తన హవా సాగిస్తూనే ఉంది.

ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది అనే తేడా లేకుండా అన్నిచోట్లా చిన్మయి పాపులర్‌. ముఖ్యంగా ఈ అమ్మడు తన 15ఏళ్ల సింగింగ్‌ కెరీర్‌లో ఎన్నడూ ఐటెమ్‌ సాంగ్‌ పాడిందే లేదు. తొలిసారి 'మేరీ నామ్‌ మేరీ' అంటూ ఓ ఐటెమ్‌ నంబర్‌ పాడింది. ప్రస్తుతం ముంబైలో ఇది హాట్‌ టాపిక్‌. బాలీవుడ్‌కి పాడడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందే గురు సినిమాలో మాయ మాయ సాంగ్‌ పాడింది. అదే సినిమాలో తెరె బినా అంటూ మెలోడిని కూడా ఆలపించింది.

టు స్టేట్స్‌, ఫటా పోస్టర్‌ నికలా హీరో చిత్రాలకు పాడింది. లేటెస్టుగా కరణ్‌ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన బ్రదర్స్‌ చిత్రం కోసం మేరీ నామ్‌ మేరీ అంటూ ఐటెమ్‌ పాట పాడింది. వాస్తవానికి ఈ ఐటెమ్‌ని కరీనాపై చిత్రీకరిస్తారని ముందే తెలియదు. ఇప్పుడు షాక్‌ తిన్నానని చెబుతోంది.